బ్రాహ్మణి భూములు ప్రభుత్వ స్వాదీనం

 

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమకు గత ప్రభుత్వం కేటాయించిన భూములను స్వాదీనం చేసుకొంతామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ రోజు ఆ కార్యక్రమం మొదలయింది. కడప జిల్లా జమ్మలమడుగులో బ్రహ్మణికి కేటాయించిన 10,600 ఎకరాల భూమి కొలతలు తీసుకొనేందుకు జిల్లా కలెక్టర్‌ అనుమతి ఈయడంతో ఆర్డీవో రఘునాధ్‌రెడ్డి తన రెవెన్యూ సిబ్బందితో కలిసి కొలతలు తీసుకోవడం ప్రారంభించారు. త్వరలో ఆ పని పూర్తిచేసి నివేదికను తన పై అధికారులకు పంపుతానని ఆయన తెలిపారు. ఈ విషయంపై వైకాపానేతలు కానీ, గాలి జనార్ధన్ రెడ్డికి సంబందించిన వ్యక్తులు గానీ మీడియాతో మాట్లాడే పరిస్థితిలో లేరు. అందువల్ల రెవెన్యు సిబ్బంది పని కొంచెం తేలికయింది.