తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం ... పడిపోయిన బ్రాయిలర్ ధరలు 

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో పౌల్ట్రి పరిశ్రమ కుదేలైంది. వేలాది కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా పాతి పెట్టాలని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంది. కృష్ణాజిల్లా నుంచి తెలంగాణలో కోళ్లు రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకున్నట్టు సమాచారం. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు అయిన రామాపురం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లో తనిఖీలు చేసి కోళ్లను తీసుకొచ్చే వాహనాలను వెనక్కి పంపుతున్నారు. బర్డ్ ప్లూ కారణంగా బ్రాయిలర్ కోళ్ల ధరలు అమాంతం పడిపోయాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu