తెలుగు ఇంజనీర్ అసోంలో సేఫ్!

 

అసోంలో బోడో తీవ్రవాదుల చేత కిడ్నాప్‌కి గురైన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇంజనీర్ నాగ మల్లేశ్వరరావును అధికారులు రక్షించారు. ఈనెల 17న నాగ మల్లేశ్వరరావును బోడో తీవ్రవాదులు అపహరించారు. నాగ మల్లేశ్వరరావును విడుదల చేయాలంటే 6 కోట్లు ఇవ్వాలని తీవ్రవాదులు డిమాండ్ చేశారు. నాగ మల్లేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి. నాగ మల్లేశ్వరావును తీవ్రవాదుల నుంచి రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. తెలుగు ఇంజనీర్‌ని కాపాడాల్సిందిగా అసోం ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఎట్టకేలకు తీవ్రవాదులు నాగ మల్లేశ్వరరావును విడుదల చేసినట్టు తెలుస్తోంది.