హిమాచల్‌లో విద్యార్థుల మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం

 

 

మంగళవారం ఉదయం శాసనసభ ప్రారంభంకాగానే హిమాచల్‌లో విద్యార్థుల మృతికి, ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటిస్తూ సబ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో విజ్ఞాన్ కళాశాల ఇజంనీరింగ్ విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు బాబు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలిలో పర్యవేక్షణకు మంత్రులు, అధికారులను పంపామని ఆయన చెప్పారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో తెలుగు విద్యార్థుల మృతికి కేవలం అధికారుల తప్పిదమే కారణమని విపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా లార్జీ డ్యాం గేట్లు ఎత్తివేశారన్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలుపుతున్నట్లు జగన్ తెలిపారు.