హెలికాప్టర్ ద్వారా మట్టి, నీళ్లు చల్లిన చంద్రబాబు

 

మన రాజధాని, మన ఊరి మట్టి అంటూ ప్రజల్లో సెంటిమెంట్ నింపుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని, జలాలను హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రాంతంలో చల్లారు, శంకుస్థాపన ఏర్పాట్లను హెలికాప్టర్ నుంచి పరిశీలించిన చంద్రబాబు... మట్టి, పుణ్యజలాలను చల్లే కార్యక్రమాన్ని కూడా పూర్తిచేశారు, వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టి, జలాలకు ముందుగా పూజలు నిర్వహించిన చంద్రబాబు... అనంతరం హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రాంతమంతటా చల్లారు, ఈ కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu