రేపు 11 గంటలకు కలాం అంత్యక్రియలు

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని ఢిల్లీ నుండి మధురైకి తరలించారు. పాలెం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో కలాం పార్ధీవ దేహాన్ని తరలించారు. ఈ విమానంలో కలాం దేహంతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ కూడా వెళ్లారు. అక్కడ మధురైలోకి కలాం మధురైలో కలాం పార్థివదేహానికి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య నివాళులర్పించగా అనంతరం అక్కడి నుండి రామేశ్వరానికి తీసుకెళతారు. అనంతరం మజీదుకు తీసుకెళ్లి ప్రార్ధనలు చేయించి అక్కడ ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం ఉండి రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు చేయనున్నారు. కలాం అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu