కలాం మరణంపై వర్మ ట్వీట్స్.. అలా చేయడం థ్రిల్లింగ్ గా ఉంది

 

భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి.. దేశానికి ఎనలేని కృషిం చేసిన ఉన్నత మనిషి అబ్దుల్ కలాం మరణంతో యావత్ భారతదేశంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కలాం మృతికి రాజకీయ నేతల దగ్గరనుండి ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలిపారు. అలాగే ఎప్పుడూ వివాదాస్పద విమర్శుల చేసే రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో కలాంకు సంతాపం తెలిపారు. ట్విట్టర్ జనాలు, సెలబ్రెటీలందరూ కలాం కు కలాం జీ రిప్ అని ట్వీట్ చేయకుండా ఆయన గురించి ఇంత కేరింగ్ గా మాట్లాడటం చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది అని ట్వీట్ చేశారు. ఎప్పుడైనా ఒక మనిషి చనిపోయినపుడే వారి విలువ గుర్తిస్తారని.. కానీ జనాలు ఎవరైనా చనిపోయినపుడే వారి విలువ గుర్తిస్తారని అంతేకాదు చనిపోయిన వ్యక్తికి కూడా తనను ఎంత ప్రేమిస్తున్నారో చనిపోయిన తరువాతే తెలుస్తుందని ట్వీటారు. కలాం మరణం తనను చాలా బాధించిందని.. ఆయన మరణాన్ని ఇండియా ఎలా తట్టుకుని ముందుకు వెళ్తుందో తెలియట్లేదని వర్మ ట్వీట్ చేసారు. అబ్దుల్ కలాం లాంటి ఉన్నతమైన వ్యక్తికి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తికి మరణం లేదని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు'' అని రాంగోపాల్ వర్న ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu