వారానికి ఐదు రోజులే పనిదినాలు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చే ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారానికి ఐదు రోజుల పనిదినాలను కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇవాళ విడుదలయ్యాయి. హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలివచ్చే ఉద్యోగులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులందరినీ దశలవారీగా కాకుండా జూన్ 27వ తేదీ కల్లా అమరావతికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీరిని దశలవారీగా కాకుండా ఒకే విడతలో నూతన రాజధాని ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దీనిపై వేగంగా చర్యలు తీసుకుంటోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu