మంత్రి జూపల్లిని కలిసిన "శ్రీమంతుడి" సతీమణి..!

సినీనటుడు మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సచివాలయంలో కలిశారు. అనంతరం ఆమె మంత్రితో ప్రత్యేక చర్చలు జరిపారు. తాము దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆమె సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను నమ్రత జూపల్లిని అడిగి తెలుసుకున్నారు. సిద్ధాపూర్ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకరిస్తామని జూపల్లి హామీ ఇచ్చారు.