వర్మ ఇంటి ముందు దర్నా చేస్తా....


రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాపై ఇప్పటికే పలు వివాదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా... ఇక మంత్రి సోమిరెడ్డి, వర్మ ల మధ్య మాటల యుద్దమే నడుస్తోంది. ఇప్పుడు ఈ డ్రామాలోకి మరో వ్యక్తి కూడా ఎంటరైంది. ఆమె ఎవరో కాదు అలనాటి నటి వాణి విశ్వనాథ్. మీడియాతో మాట్లాడిన ఆమె... తెలుగు ప్రజల మనసులో ఆయన ఓ రాముడిగా, కృష్ణుడిగా ముద్రవేసుకున్నారు. ఆయన జీవితం గురించి బాలకృష్ణ ఓ చిత్రాన్ని తీస్తున్నారు. అది గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి కాబట్టి ఎన్టీఆర్‌ను దేవుడిలాగానే చూపిస్తారు. కానీ, రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’పై అనుమానాలున్నాయి. అందుకే ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాన్ని వర్మ వెంటనే విరమించుకోవాలి. ఎన్టీఆర్‌కు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగుతా. వర్మ తీసే సినిమా పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉంది. ఎన్టీఆర్‌ నటించిన ‘సామ్రాట్‌ అశోక్‌’ చిత్రంలో కథానాయికగా నేను నటించా. ఓ వీరాభిమానిగా చెబుతున్నా. వర్మ సినిమా తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవడం ఉత్తమం’ అని అన్నారు.

 

కాగా ఇటీవల వాణి విశ్వనాథ్ టీడీపీ చేరుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. మరి ఇంతకీ వాణి విశ్వనాథ్ వ్యాఖ్యలకు వర్మ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం...