పార్టీ పగ్గాలు శశికళ చేతిలోకే...


అందరూ అనుకున్నదే జరిగింది. చెన్నై దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీ బాధ్యతలు ఆమె నిచ్చెలి అయిన శశికళకే అప్పగించే అవకాశాలు అన్నాయి అని అందరూ అనుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు అందరి అనుమానాలనే నిజం చేస్తూ.. పార్టీ నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళకు అప్పగిస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అమ్మ జయలలిత చూపిన దారిలో పార్టీని నడపాలని శశికళను పార్టీ నేతలు కోరారు. అయితే కొంతమంది సీనియర్ నేతలకు మాత్రం శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం ఇష్టంలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వ మద్దతే శశికళకు ఉండటం వల్ల పని సులువుగా అయిందంటున్నారు. మొత్తానికి శశికళ కల సాకారమయినట్టయింది. కాగా ఇంతకుముందు జయలలిత ఈ పదవిలో ఉండేవారు. దాదాపు 27 ఏళ్లపాటు పార్టీ ప్రధాన కార్యదర్సిగా ఆమె ఉన్నారు.