ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవం చేయనున్న మోడీ

 

ఆఫ్ఘనిస్తాన్ కోసం భారత్ నిర్మించి ఇస్తున్న పార్లమెంటు భవనాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడి రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని కొద్ది సేపటి క్రితమే కాబూల్ చేరుకొన్నారు. ఆ దేశ రాజధాని కాబూల్ నగరంలో సుమారు 86 ఎకరాల విస్తీర్ణంలో రూ.710 కోట్ల వ్యయంతో మొఘల్ సంస్క్రతీ సంప్రదాయాలను ప్రతిభింబిస్తూ పార్లమెంటు భవనం నిర్మించబడింది. ఆఫ్ఘన్ పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవం చేసిన తరువాత నరేంద్ర మోడీ డిల్లీ చేరుకొని భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ నివాసానికి వెళతారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu