ధర్మానను విచారిస్తున్న సిబిఐ

 

Dhramana Prasad Rao, Dhramana Prasad Rao cbi, cbi Dhramana Prasad Rao

 

 

మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు బుధవారం ఉదయం సిబిఐ ఎదుట హాజరయ్యారు. దిల్ కుశ అతిథి గృహంలో సిబిఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద సిబిఐ నిన్న ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జ్ ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సిబిఐ విచారిస్తోంది. కాగా, ఇప్పటికే ధర్మాన ప్రసాద రావు పైన సిబిఐ ఒక ఛార్జీషీటు దాఖలు చేసింది. ఆయన సిబిఐ ఎదుట హాజరు కావడం ఇది మూడోసారి.