ఆర్.కృష్ణయ్యపై దాడి : పార్టీలోవారి పనే!

 

 

 

వెనుకబడిన కులాల సంఘం అధ్యక్షుడు, ఎల్.బి.నగర్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి అర్.కృష్ణయ్యపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గం స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన కృష్ణయ్యపై స్థానిక తెలుగుదేశం కార్యకర్తలే దాడిచేసినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో నియోజకవర్గంలో పార్టీకి సేవ చేస్తున్న వారికి టిక్కెట్ ఇవ్వకుండా, కొత్తగా టీడీపీలో చేరిక కృష్ణయ్యకి టిక్కెట్ ఇచ్చారన్న అక్కసుతోనే ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం అని ప్రచారంలో వున్న ఆర్.కృష్ణయ్యకి తన నియోజకవర్గంలో వున్న కార్యకర్తల మద్దతు కూడా లేకపోవడం బ్యాడ్ లక్. తెలుగుదేశం కార్యకర్తలు జరిపిన దాడిలో కృష్ణయ్య కారు అద్దాలు పగిలాయని, కృష్ణయ్యకి కూడా స్వల్ప గాయాలైనట్టు సమాచారం.