మొటిమల నివారణ కోసం
చిన్న పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానా మట్టి తీసుకొని, అంతే మోతాదులో గంధం పొడి, రెండు చుక్కల అల్లం రసం, కోడిగుడ్డులోని తెల్ల సొన, టీ స్పూన్ రోజ్వాటర్ బాగా కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
కొన్ని తులసి ఆకులు అంతే పరిమాణంలో పుదీనా ఆకులు తీసుకుని కొన్ని చుక్కల నీటిని జత చేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి 30 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
రెండు టీ స్పూన్ల పసుపులో టీ స్పూన్ రోజ్వాటర్ కలిపి పేస్ట్ చేసి, ముఖంపై అప్లై చేసి ఆరిన తరవాత చల్లటి నీటితో కడిగేయాలి.
ఈ ప్యాక్లు వారంలో ఒకసారి క్రమం తప్పకుండా రెండు నెలలపాటు చేస్తే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.