ఏళ్లు గడిచినా అందం చెక్కుచెదరకూడదంటే వీటిని తినాల్సిందే..    అందం వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంచారు. ఇందులో మహిళలదే పైచేయి. అందంగా కనిపించడం కోసం మహిళలు ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ వాడుతుంటారు.  కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ప్రొడక్ట్స్   తాత్కాలిక అందాన్ని ఇస్తాయే కానీ దీర్ఘకాల అందాన్ని,  యవ్వనాన్ని ఎప్పటికీ అందించవు. పైపెచ్చు ఎక్కువ కాలం వాటిని వాడటం వల్ల చర్మం దెబ్బ తింటుంది. నిజానికి, బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం అందంగా కనిపించేలా చేస్తాయి  కానీ  చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా,  అందంగా ఉంచవు. కొల్లాజెన్ ఈ పని చేస్తుంది. కొల్లాజెన్ ఒక ప్రొటీన్. శరీరం  30 శాతం ప్రోటీన్ కొల్లాజెన్‌తో రూపొందించబడింది, ఇది  చర్మం, కండరాలు, ఎముకలకు సపోర్ట్ ను, బలాన్ని అందిస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ  శరీరంలోని కొల్లాజెన్ విచ్ఛిన్నమవుతుంది.  కొత్త కొల్లాజెన్‌ను తయారు చేసే ప్రక్రియ కూడా క్రమంగా తగ్గుతుంది. అందువల్ల  తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి,  చర్మం వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కొన్ని శక్తివంతమైన ఆహారాలు ఉన్నాయి. ఇవి ఔషదాలుగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..  అశ్వగంధ.. తీసుకునే  ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవాలి. ఇది ఆయుర్వేద మూలిక, దీన్ని  ఉపయోగించడం వల్ల  వృద్ధాప్య లక్షణాలను క్రమంగా తగ్గించవచ్చు. ఉసిరి.. ఉసిరిలో  విటమిన్ సి చాలా ఉంటుంది. ఉసిరి శరీరంలోని కొల్లాజెన్ స్థాయిని సహజంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు దెబ్బతిన్న చర్మాన్ని కూడా రిపేర్ చేస్తుంది.   తులసి.. తులసి గొప్ప ఔషద మూలిక. ఇందులో ఉండే  ఉర్సోలిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్,  యూజినాల్  చాలా శక్తివంతమైనవి. ఇవి  గొప్ప యాంటీఆక్సిడెంట్లు.  ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి తులసిలో చాలా  ఉంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే   చర్మంలో కొల్లాజెన్ పెరుగుతుంది. నెయ్యి.. నెయ్యిలో విటమిన్ ఎ, డి,  ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతో అవసరం. విటమిన్ ఎ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మార్చే  ప్రోటీన్. నెయ్యిలో విటమిన్లు కూజా చాలా  ఉంటాయి.  ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది,  అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. బ్రహ్మి.. బ్రాహ్మిని సరస్వతి అని కూడా అంటారు. ఇది  ఆయుర్వేద మూలిక. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కణాలను మెరుగుపరుస్తుంది,  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఫార్మాస్యూటికల్,  ఆయుర్వేద సూత్రీకరణలలో ప్రెగ్నెన్సీ తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్,  స్ట్రెచ్ మార్కులను తేలికగా చేయడానికి ఉపయోగిస్తారు.                                            *నిశ్శబ్ద.

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!   వయసు పెరిగే కొద్దీ మన స్కాల్ప్, హెయిర్, స్కిన్ అన్నీ తమ మెరుపును కోల్పోతాయి. మన చర్మం మెరిసిపోవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అంతే కాకుండా మనం తిన్న తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా కారణం. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని లోపలి నుండి కాపాడుకోవచ్చు. వయస్సు పెరుగుతున్నా... యవ్వనంగా కనిపించాలంటే వీటిని తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయి పండు: బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది. దానిమ్మ పండు: దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే  చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు  చర్మ సమస్యలు కూడా ఉండవు. పెరుగు: పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ఆకు కూరలు: ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.  క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. టమోటా: టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం  తాజాగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  

 పొడవాటి కనురెప్పల కోసం అల్టిమేట్ ట్రిక్స్ ..!! అందమైన కళ్ళు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. కళ్ల అందం కోసం, వెంట్రుకలు నల్లగా, మందంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది తమ వెంట్రుకలు నల్లగా,  మందంగా చేయడానికి ఆర్టిఫిషయల్ ఐస్లాష్ వాడుతుంటారు. అయితే సహజసిద్ధంగా కూడా కనురెప్పలను అందంగా మార్చుకోవచ్చు. వెంట్రుకలను మందంగా, నల్లగా మార్చే సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం.  ఈ హోం రెమెడీస్ తో మీరు వెంట్రుకలను ఆకర్షణీయంగా, అందంగా మార్చుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ: కనురెప్పలు నల్లగా, మందంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కనురెప్పలపై రాయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పొడవుగా, మందంగా, ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి. గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కనురెప్పల వెంట్రుకలను పొడవుగా చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం,  కనురెప్పల మీద అప్లై చేయడం వల్ల కూడా కనురెప్పలు అందంగా తయారవుతాయి. విటమిన్ ఇ: విటమిన్ ఇ కనురెప్పల జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తుంది. మీరు మార్కెట్లో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీనితో మీరు వెంట్రుకలపై జుట్టు రాలడం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు కనురెప్పల పెరుగుదలకు సహాయపడతాయి. దీన్ని కనురెప్పలపై అప్లై చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా మందంగా, పొడవుగా మారుతాయి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనె కనురెప్పలకు కూడా మేలు చేస్తుంది.  

 ప్రతి రోజూ ఉదయాన్నే చేసే ఈ ఆరు తప్పుల వల్ల అమ్మాయిలు  ఎంత నష్టపోతున్నారో తెలుసా..   ఉదయం లేచింది మొదలు మనిషి రోజు మొదలవుతుంది. ఈకాలంలో చాలామంది ఎక్కువగా ఆరోగ్యోం మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఆరోగ్యం అనుకుంటూ ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు. మరికొందరు సాధారణం అనుకునే అలవాట్లు ఎన్నెన్నో  నష్టాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు డైటింగ్ విషయంలోనూ, అందాన్ని కాపాడుకోవడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వీటిలో చాలావరకు లాభం చేకూర్చకపోగా నష్టం చేకూర్చుతాయి. వీటిని తెలుసుకోకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, పూర్తీగా అందం ఆరోగ్యం నష్టపోయాక భాధపడాలి. అందరూ కామన్ అనుకుంటూ చేస్తున్న ఆ ఆరు తప్పులు ఏంటో తెలుసుకుంటే.. ఓట్స్.. అమ్మాయిలు ఉదయాన్నే ఎక్కవగా తీసుకునే అల్పాహారం ఓట్స్. ఓట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగరని తద్వారా అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ప్రతి రోజూ ఓట్స్ తీసుకుంటే ఉదయాన్నే శరీరానికి అందాల్సిన పోషకాలు చాలావరకు లాస్ అవుతారు. ఓట్స్ లో పైబర్, బరువు తగ్గింటే కారకాలు ఉంటాయి తప్ప శరీరానికి ప్రోటీన్ ఏమీ అందించదు. పైపెచ్చు ఓట్స్ ను ప్రతిరోజూ తింటే చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది. చర్మం మీద చారలు చారలుగా గీతలు ఏర్పడటం జరుగుతుంది. స్నానం.. ఉదయాన్నే వేడినీటితో స్నానం చేస్తే కలిగే రిఫ్రెష్మెంట్ యే వేరు. కానీ ప్రతిరోజూ వేడి నీటి స్నానం ఆరోగ్యానికి మంచి చేకూర్చకపోగా చెడు చేస్తుందంటున్నారు. వేడినీటి స్నానం శరీరంలో తేమశాతాన్ని చాలా తొందరగా లాగేస్తుందట. ఇక ముఖం కడగడానికి వేడి నీటిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం చాలా తొందరగా  ముడతలు వస్తాయి. ముఖం ముసలిగా మారిపోతుంది. కాఫీ.. చాలామందికి కాఫీ అనేది ఒక ఎమోషన్.  ఉదయాన్నే ఒక కప్పు కాఫీ పడితే కానీ పనులు ముందుకు సాగవు. ఆ తరువాత కాఫీ టిఫిన్  కు ముందు, ఇక చాలామందికి టిఫిన్ తరువాత  వేడిగా, స్ట్రాంగ్ గా కాపీ పడాల్సిందే. కానీ ఈ అలవాటు చాలా చెడ్డది. సహజంగానే కాఫీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలో ఉన్న టాక్సిన్ లు బయటకు వెళ్లడంలో ఇబ్బంది కలిగిస్తుంది. సన్ స్క్రీన్.. అమ్మాయిలు సన్ స్క్రీన్ అప్లై చేయడం లైఫ్ స్టైల్ లో భాగం చేసుకున్నారు. ఇది  సుర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కానీ కొందరు అలవాటులో పొరపాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్నానం తరువాత సన్ స్క్రీన్ అప్లై చేస్తుంటారు. దీని కారణంగా చర్మం దారుణంగా దెబ్బతింటుంది. అందుకే అవసరమైన సందర్బాలలో మాత్రమే సన్ స్క్రీన్ ఉపయోగించాలి. బ్యూటీ ప్రోడక్ట్స్.. చర్మం  ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి అమ్మాయిలు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ చర్మం బాగుండాలంటే ఈ బ్యూటీ ఉత్పత్తులేవీ అక్కర్లేదు. కేవలం సీజన్ కు తగ్గట్టుగా చర్మ సంరక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అవేమీ పట్టించుకోకుండా సీజన్ తో సంబంధం లేకుండా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే  ముఖచర్మం చాలా తొందరగా వృద్దాప్యంగా మారుతుంది. ఫేస్ వాష్.. ఉదయం లేవగానే చాలామందికి ముఖమంతా చాలా జిడ్డుగా ఉంటుంది.  దీన్ని వదిలించుకోవడానికి చాలా గాఢత కలిగిన కెమికల్స్ తో కూడిన ఫేస్ వాష్ లు ఉపయోగిస్తుంటారు. మరికొందరికి పేస్ వాష్ ఉపయోగించడం అంటే అదొక ఫ్యాషన్. కానీ  ఫేష్ వాష్ లు ముఖ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తాయి. అందుకే  ముఖం జిడ్డుగా ఉంటే తేలికపాటి క్లెన్సర్ ని ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి.                                               నిశ్శబ్ద.  

చుండ్రు తగ్గించే తేలికైన ఉపాయాలు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల రోజు రోజుకి చుండ్రు సమస్యలు ఎక్కువైపోతున్నాయి . చుండ్రు వల్ల జుట్టు రాలిపోవటం, పేలు రావడం, దురద లాంటివి మొదలవుతాయి. ఈ సమస్యను అరికట్టాలంటే చిన్న చిన్న చిట్కాలు చేయాల్సిఉంటుంది . అవేంటో చూసేద్దాం రండి .. * వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. చుండ్రు పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు, కొద్దిగా మందారకు,కొద్దిగా కలబంద గుజ్జు ఈ మూడింటిని మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. * పిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఇందుకోసం వెనిగర్ ను, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. * కొబ్బరి నూనెతోనూ చుండ్రు ని తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది. ఒకవేళ టీ ట్రీ ఆయిల్ లేకపోతే మామూలు కొబ్బరినూనె లో కొద్దిగా కర్పూరం పొడి వేసి కలిపి తలకి పెట్టుకున్న చుండ్రు తగ్గుతుంది. * తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.చుండ్రు తగ్గే వరకూ ఇలా చేయాలి. * పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ పెరుగు లో ఒక స్పూన్ మెంతి పొడి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం పూట తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

ఈ ఫేస్ ప్యాక్‎లతో ముఖంపై ముడతలకు చెక్..!! అందం మనకు భగవంతుడిచ్చిన వరం. దాన్ని సరిగ్గా ఉపయోగించాలంటే మనం టెక్నిక్ తెలుసుకోవాలి. మితిమీరిన మేకప్ కూడా మంచిది కాదు. ఉన్న అందాన్ని ఎక్కువ కాలం నేచురల్ గా మెయింటైన్ చేయాలంటే దాని కోసం నేచురల్ టిప్స్ ఫాలో అవడం మంచిది. అంటే సహజసిద్ధమైన పదార్థాలతో అందాన్ని కాపాడుకోవడం. ఇటీవలి వ్యక్తులలో గమనించదగ్గ ఒక లక్షణం ఏమిటంటే వారు చిన్న వయస్సులో ఉన్నప్పటికీ వారు వృద్ధాప్యంగా కనిపిస్తారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. ఇక్కడ కొన్ని అద్భుతమైన నేచురల్ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఎగ్ వైట్ , లెమన్ జ్యూస్ ఫేస్ ప్యాక్! గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రొటీన్ మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముడతలను తగ్గిస్తుంది.  నిమ్మరసం విటమిన్ సి కంటెంట్‌ను కలిగి ఉంటుంది, ఇది మన శరీరం చర్మానికి ఉపయోగపడే కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి: -కోడి గుడ్డు నుండి పచ్చసొనను తొలగించి తెల్లసొన తీసుకోండి. -దానిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి -ఒక చెంచా సహాయంతో గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలపండి. -ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి వేలికొనలతో అప్లై చేయండి. -ఇది సుమారు 15 నుండి 20 నిమిషాలు ఆరనివ్వండి. -ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. క్యారెట్,బాదం నూనె ఫేస్ ప్యాక్: ముఖంపై ముడతలను పోగొట్టడంలో,  మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో క్యారెట్ చాలా బాగా పని చేస్తుంది, తద్వారా మీ చర్మం ఎల్లప్పుడూ తాజాగా కనిపిస్తుంది. ఇది కాకుండా, బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ప్యాక్ ను ఇలా ఉపయోగించండి: -మీడియం సైజులో ఉండే రెండు క్యారెట్లను తీసుకుని వాటి పై తొక్క తీసి మెత్తగా ఉడికించాలి. -తర్వాత క్యారెట్‌లను బాగా మగ్గనివ్వాలి -ఇప్పుడు క్యారెట్‌లో ఒక టీస్పూన్ బాదం నూనె వేసి కలపాలి -దీన్ని ఒక గంట పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, మీ చెంపలపై, కళ్ల చుట్టూ, గడ్డం మీద అప్లై చేయండి. -ఇలా అరగంట అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. బొప్పాయి ఫేస్ ప్యాక్: బొప్పాయి పండులో పాపైన్ ఉండటం వల్ల, ఇది మృత చర్మ కణాలను తొలగించడంలో పనిచేస్తుంది. ఇది చర్మాన్ని చాలా సాగేలా, దృఢంగా చేస్తుంది. బొప్పాయిలో మెగ్నీషియం,  ఫోలేట్ కూడా ఉన్నాయి, కాబట్టి ఇది ఆరోగ్యకరమైన చర్మం,  మృదువైన చర్మానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ ఎలా ఉపయోగించాలి: -బాగా పండిన బొప్పాయి పండు కొన్ని ముక్కలను తీసుకోండి -దీన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి - మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి -తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి -ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. దోసకాయ ఫేస్ ప్యాక్: దోసకాయ మీ శరీరానికి యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ను అందిస్తుంది. ఇది మీ చర్మంపై ముడతలను తొలగిస్తుంది. అలాగే నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఈ ప్యాక్ ఎలా ఉపయోగించాలి: -సగం దోసకాయ తీసుకుని బాగా తురుముకోవాలి -దీనికి బీట్ చేసిన గుడ్డులోని తెల్లసొన భాగాన్ని జోడించండి -ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి -దీన్ని మీ చర్మంపై పూయండి. -తర్వాత 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి -ఇలా రోజు విడిచి రోజు అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న ఫైన్ లైన్స్ తొలగిపోతాయి

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ సౌందర్యాన్ని పెంచుకునే సింపుల్ టిప్స్ ఇవే..!! నేచురల్ గా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం అందాన్ని పెంచుకోవాలంటే కెమికల్ ప్రొడక్ట్స్ వాడే బదులు నేచురల్ ఫేస్ ప్యాక్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. చాలామందికి నలుగురిలో తామే స్మార్ట్ గా, అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. తాత్కాలికంగా ముఖ అందాన్ని పెంచినప్పటికీ...సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్ ఎలిమెంట్స్ ఒక్కసారి ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. దీని తర్వాత మళ్లీ అందం మసకబారుతుంది! కాబట్టి అనవసరమైన కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం, డబ్బు ఖర్చుపెట్టి ముఖ సౌందర్యాన్ని పాడుచేసుకోవడం కాకుండా కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను వాడితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాంటి సహజసిద్ధమైన ఉత్పత్తులేంటో నేటి కథనంలో చూద్దాం... పండిన అరటి: సాధారణంగా, అరటిపండు ఎక్కువగా పండినట్లయితే, గుజ్జు మెత్తగా మారుతుంది. అలాంటప్పుడు వాటిని తినాలని అనిపించదు. దానిని చెత్తబుట్టలో పడేస్తుంటాము. అయితే ఇకపై అలా చేయకండి, ఈ పండును పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే చిన్న వయసులో కనిపించే వృద్ధాప్య లక్షణాలు క్రమంగా మాయమవుతాయి. - ముందుగా, బాగా పండిన అరటిపండును తీసుకుని.. పేస్ట్‌లా చేసుకోవాలి. -ఇందులో అర టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ గట్టి పెరుగు కలపాలి. -ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగంలో మందంగా అప్లై చేసి, పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. పాలు : పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా పాలు, దాని ఉత్పత్తుల పేరు ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి. పూర్వ మహారాణులు  తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పాలతో చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ తో స్నానం చేసేవారని పురాణాలు కూడా చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్. ఇది చర్మంపై మచ్చలు, మొటిమలను తొలగిస్తుంది, ముఖం యొక్క అందం, కాంతిని పెంచుతుంది - కొంచం కుంకుమపువ్వును పాలలో కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. దాదాపు అరగంట తర్వాత స్నానం చేయాలి. - రెండు టేబుల్‌స్పూన్‌ల క్రీమ్‌లో అర టీస్పూన్ పసుపు, ఒక చిన్న చెంచా శనగ పిండి వేసి బాగా కలపాలి. -ఆ తర్వాత వేళ్ల సహాయంతో ముఖానికి పట్టించి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఐదునిమిషాలపాటు ఉంచి నీళ్లతో కడిగేయాలి. కలబంద: సహజంగా లభించే ఈ కలబంద గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఉన్నాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు, చిన్న వయసులో కనిపించే ముసలితనం సంకేతాలు, చర్మంపై దద్దుర్లు మొదలైనవి చాలా త్వరగా తొలగిపోతాయి. -ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ -తేనె సగం టీస్పూన్ -గట్టి పెరుగు అర టీస్పూన్ -ఒక చిన్న టీస్పూన్ రోజ్ వాటర్ పైన పేర్కొన్న మిశ్రమాలన్ని  ఒక గిన్నెలో వేసి బాగా కలపండి, మందపాటి పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు వేళ్ల సహాయంతో, ఈ పేస్ట్‌ను ముఖంపై సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయండి.  పావుగంటపాటు పేస్టును ముఖంపై ఉంచి..గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి.   పసుపు:  పసుపును పొగబెట్టినా తక్కువే. ఎందుకంటే దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మన అందానికి ఈ పసుపుతో మంచి సంబంధం ఉంది.  ఈ రోజుల్లో పెద్ద బ్రాండ్ బ్యూటీ కంపెనీలు కూడా తమ చర్మ సంరక్షణ ఉత్పత్తులలో పసుపుపై ఆధారపడుతున్నాయి. ఒక గిన్నెలో అర చెంచా పసుపు పొడి, ఒక టీ చెంచా నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిపి పేస్టులా చేసుకోవాలి. వేళ్ల సహాయంతో వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. పదిహేను నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గడమే కాకుండా ముఖ సౌందర్యం కాంతివంతంగా మారుతుంది.

ప్రతి అమ్మాయి తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకోవాల్సిన 5 బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవే..!! నేటి రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో, మనం ఎప్పుడూ చాలా విషయాల గురించి గందరగోళంలో ఉంటాము. వీటిలో ఒకటి మేకప్ ఉత్పత్తులు. అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఇష్టపడతారని మనందరికీ తెలుసు. కానీ మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, మన రూపాన్ని కాపాడుకోవడానికి, మనం ఎల్లప్పుడూ కొన్ని వస్తువులను మన బ్యాగ్‌లో ఉంచుకోవాలి. సహజంగానే  మొత్తం మేకప్ కిట్‌ను  బ్యాగ్‌లో అన్ని సమయాలలో ఉంచుకోలేము. అటువంటి పరిస్థితిలో, మన బ్యాగ్‌లో ఎల్లప్పుడూ ఉండవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువుల జాబితా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. సన్స్క్రీన్: సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని UVA UVB నుండి రక్షిస్తుంది. అంటే సూర్యుని హానికరమైన కిరణాలు, కాలుష్యం నుండి కూడా రక్షిస్తుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా, కనీసం 5 నుండి 10 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ అప్లై చేసి, కొన్ని గంటల తర్వాత మళ్లీ అప్లై చేయండి. మీరు సన్‌స్క్రీన్‌ను ఇండోర్, అవుట్‌డోర్‌లో ఉపయోగించవచ్చు. కాజల్ పెన్సిల్: కాజల్ పెన్సిల్ మహిళల రూపాన్ని తక్షణమే పెంచడానికి పనిచేస్తుంది. ఇది మీ కళ్లను అందంగా మార్చడం ద్వారా మీ ముఖానికి మరింత అందాన్ని ఇస్తుంది. మీరు స్నేహితుడిని కలవాల్సి వచ్చినా లేదా ఎవరితోనైనా డిన్నర్ కు  వెళ్లాల్సి వచ్చినా ఎల్లప్పుడూ స్మడ్జ్ ప్రూఫ్, వాటర్‌ప్రూఫ్ కాజల్‌ని ఉపయోగించండి. వెట్ వైప్స్: మీ బ్యాగ్‌లో వెట్  వైప్స్ చిన్న ప్యాకెట్ ఉంచడం మర్చిపోవద్దు. మీరు ఆఫీసుకు, కాలేజీకి లేదా బయట ఎక్కడికైనా వెళితే, మీ ముఖంలోని మురికిని శుభ్రం చేయడంలో ఇది సహాయపడుతుంది. మీరు జిడ్డుగల లేదా పొడి చర్మం కలిగి ఉన్నారా, ఇది అందరికీ పని చేస్తుంది.   కాంపాక్ట్: టచ్-అప్‌ల కోసం మీ బ్యాగ్‌లో చిన్న అద్దంతో కూడిన మేకప్ కాంపాక్ట్ తప్పనిసరిగా ఉండాలి. తరచుగా టచ్‌అప్‌లతో, మీరు మీ మేకప్‌ను అతుక్కొని ఉంచుకోవచ్చు. లిప్ బామ్‌: మన పెదవులకు ఎల్లవేళలా పోషణ, తేమ అవసరం. మారుతున్న సీజన్‌లో, మన పెదాలు చాలా పొడిగా, పగిలిపోయేలా చేస్తాయి. కాబట్టి దీనిని నివారించడానికి, మీరు తప్పనిసరిగా మీతో లిప్ బామ్‌ను ఉంచుకోవాలి. లిప్ బామ్‌లు పర్యావరణ కాలుష్యం నుండి మీ పెదాలను రక్షించడంలో కూడా సహాయపడతాయి.  

 పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి.. పిల్లలు తరచుగా జ్వరం, ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఆకస్మిక దగ్గు, జ్వరం, జలుబు, ఆయాసం వేధిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాలు ఇన్ఫెక్షన్లు, ఆకస్మిక వాతావరణ హెచ్చుతగ్గులు. పెరిగిన శరీర ఉష్ణోగ్రత, అంటువ్యాధులతో పోరాడే ప్రక్రియ, శరీరం నుండి ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. అందుకే పిల్లలు జబ్బు బారిన పడగానే.. పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కాబట్టి పిల్లలు త్వరగా కోలుకోవడానికి తల్లిదండ్రులు ఎలాంటి ఆహారాలు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, కరివేపాకు పొడి: పిల్లలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు పసుపు, కరివేపాకు పొడిని ఆహారంలో చేర్చండి. వీటిలో శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. మిల్క్ షేక్: రుచిలేని నాలుకకు మిల్క్ షేక్ ఉత్తమం. పిల్లలు తినడానికి ఆసక్తి చూపవచ్చు. అరటి-వాల్నట్ మిల్క్ షేక్..జ్వరంతో బాధపడుతున్నవారికి ఇవ్వాల్సిన ఆహారంలో ఒకటి.  ఇది నరాలు, కండరాలు, రోగనిరోధక శక్తి, మెదడుకు మద్దతు ఇచ్చే పూర్తి, పోషకమైన ఎంపికగా పనిచేస్తుంది. ఈ అరటి-వాల్నట్ మిల్క్ షేక్ మీరు వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. డ్రైఫ్రూట్స్: పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్‌ను కరకరలాడే స్నాక్‌గా ఇవ్వవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఆప్రికాట్లు, అత్తి పండ్లు, ఎండుద్రాక్ష వంటి వాటిని ఇస్తుండాలి. ఇవి ప్రేగు కదలికలను ప్రేరేపిస్తాయి. పండ్లు, కూరగాయలు: పిల్లలు త్వరగా కోలుకోవడానికి పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చాలి.  కూరగాయలతో చేసిన వంటకాలు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. వీటితో పాటు ఫ్రూట్ జ్యూస్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. పుచ్చకాయ దాదాపు 91% నీరు కలిగి ఉంటుంది.  జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ఇది అనువైనది. అలాగే, పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. వేడి నీరు: పిల్లల జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి వేడినీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బిడ్డ గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా వేడిచేసిన నీటిని ఇవ్వండి. వేడి నీళ్ళు గొంతు నొప్పి, మూసుకుపోయిన ముక్కుకు ఉపశమనంగా పనిచేస్తాయి.  

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు! వయసు పెరిగే కొద్దీ మన స్కాల్ప్, హెయిర్, స్కిన్ అన్నీ తమ మెరుపును కోల్పోతాయి. మన చర్మం మెరిసిపోవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అంతే కాకుండా మనం తిన్న తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా కారణం. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని లోపలి నుండి కాపాడుకోవచ్చు. వయస్సు పెరుగుతున్నా... యవ్వనంగా కనిపించాలంటే వీటిని తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయి పండు: బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది. దానిమ్మ పండు: దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే  చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు  చర్మ సమస్యలు కూడా ఉండవు. పెరుగు: పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ఆకు కూరలు: ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.  క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. టమోటా: టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం  తాజాగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  

బంగాళాదుంపతో పిగ్మెంటేషన్ దెబ్బకు మాయమవుతుంది! చర్మ సమస్యలు మొటిమలు,  చిన్న మచ్చలు మాత్రమే కాదు, చర్మం అక్కడక్కడా రంగుమారడం కూడా ముఖ చర్మాన్ని దెబ్బతీస్తుంది. హైపర్పిగ్మెంటేషన్  తీవ్రమైన  చర్మ సమస్యగా పరిగణిస్తుంటారు. ఒకసారి ఈ సమస్యలు మొదలైతే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. స్కిన్ పిగ్మెంటేషన్ అనేక కారణాల వల్ల కావచ్చు. వీటిలో ముఖ్యమైనది అధిక మెలనిన్ ఉత్పత్తి. దీని కారణంగా ముఖం మీద పెదవుల చుట్టూ, ముక్కు ఇరువైపులా, కళ్లకింది భాగంలోనూ చర్మం రంగు మారి కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని గురించి చింతించాల్సిన పనిలేదు.  ఈ పిగ్మెంటేషన్ ను సమర్థవంతంగా తొలగించడంలో బంగాళాదుంప అధ్బుతంగా పనిచేస్తుంది.  బంగాళాదుంపలలో ఎంజైమ్‌లు, విటమిన్లు,  మినరల్స్ ఉంటాయి, ఇవి డార్క్ స్పాట్‌లను తేలికపరచడానికి,  చర్మపు రంగును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడతుంది. ఇందుకోసం బంగాళాదుంపను  ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. పిగ్మెంటేషన్ తొలగించడానికి బంగాళాదుంపను ఎలా ఉపయోగించాలి? బంగాళదుంప రసం టోనర్.. బంగాళాదుంప రసం సహజ టోనర్‌గా అద్భుతంగా పనిచేస్తుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.  పిగ్మెంటేషన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టోనర్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల డార్క్ స్పాట్స్‌ని తగ్గించి, స్కిన్ టోన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. బంగాళాదుంప టోనర్ ఎలా చేయాలంటే.. బంగాళాదుంప టోనర్ చేయడానికి, ఒక బంగాళాదుంపను చెక్కు తీసి దాన్ని సన్నగా  తురుముకోవాలి. తరువాత గట్టిగా పిండితే రసం వస్తుంది. దీన్ని ఒక చిన్న కప్ లో తీసుకోవాలి.  ముఖం మీద మచ్చలు, రంగు మారిన ప్రాంతాలను కవర్ చేస్తూ కాటన్ బాల్ లేదా కాటన్ ప్యాడ్ సహాయంతో రసాన్ని నేరుగా  ముఖంపై అప్లై చేయాలి. దీన్ని 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. బంగాళాదుంప మాస్క్ బంగాళాదుంప ముక్కలు చర్మానికి చల్లదనాన్ని,  మృదువు స్వభావాన్ని కలిగిస్తాయి.   పిగ్మెంటేషన్ ద్వారా చికాకు లేదా ఎర్రబడిన ప్రాంతాలను నయం చేయడంలో సహాయపడతాయి.  బంగాళాదుంపను మందపాటి చక్రాలుగా  కట్ చేసి వాటిని ముఖం మీద ప్రభావిత ప్రాంతాలలో ఉంచాలి. ఈ ముక్కలను సుమారు 15-20 నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై  ముఖాన్ని నీటితో కడగాలి. దీన్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటే కాలక్రమేణా ముఖ చర్మం మీద  ఎరుపు,  పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బంగాళదుంప,  నిమ్మరసం ఫేస్ ప్యాక్..  బంగాళాదుంప రసానికి సమాన మొత్తంలో తాజా నిమ్మరసం మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని  ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ ను 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నిమ్మరసం కొద్దిగా జలదరింపును కలిగిస్తుంది, కాబట్టి ఈ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యం. 15నిమిషాల తరువాత దీన్ని శుభ్రమైన నీటితో కడిగేయాలి. బంగాళాదుంప , తేనె ప్యాక్..  ఒక టీస్పూన్ తేనెతో మిక్సీ పట్టిన  బంగాళాదుంప పేస్ట్ కలపాలి. దీన్ని  మందపాటి పేస్ట్ గా  తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖంపై సమానంగా అప్లై చేసి 20-25 నిమిషాలు అలాగే ఉంచండి. 20-25 నిమిషాల తరువాత  నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖ చర్మానికి పోషణను ఇవ్వడమే కాకుండా ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్,  మొటిమట తాలూకు గుర్తులు తొలగిస్తుంది.                                                                   *నిశ్శబ్ద.

ముడతలు తొలగించి ముఖాన్ని అందంగా మార్చే హోం రెమెడీస్ ఇవే! అందంగా కనిపించాలంటే మన చర్మం ఆరోగ్యంగా ఉండాలి. చర్మంపై చిన్నపాటి నల్లటి మచ్చ కనిపించినా అది మన అందాన్ని డ్యామేజ్ చేస్తుంది. చిన్న వయసులోనే మనల్ని ముసలివాళ్లలా చేసే ఫైన్ లైన్లు, ముడతలు, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటినుంచి బయటపడేందుకు సహజసిద్ధమైన పద్ధతులను పాటిస్తే మంచిది. మార్కెట్‌లో లభించే వివిధ రకాల సౌందర్య సాధనాలను ఉపయోగించవచ్చు. కానీ వాటి ప్రభావం తాత్కాలికమే. వాటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ నేచురల్ రెమెడీస్ చర్మ సౌందర్యాన్ని శాశ్వతంగా పెంచుతాయి. నాలుగు పదుల వయసులోనూ అందంగా కనిపించాలంటే ఈ హోం రెమెడీస్‎ను ఉపయోగించడం మంచిది. గుడ్డులోని తెల్లసొన: గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు మీ చర్మ ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. చర్మంపై వచ్చే ముడతలకు నేచురల్ రెమెడీ అని చెప్పవచ్చు. -దీని కోసం మీరు ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొనను తీసుకొని నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు. -మృదువుగా మసాజ్ చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. -ఇలా చేయడం వల్ల గుడ్లలో ఉండే ప్రొటీన్, విటమిన్ బి, విటమిన్ ఇ మీ చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనె: రాత్రి పడుకునే ముందు మీ చర్మంపై కొన్ని చుక్కల ఆలివ్ నూనెతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. తర్వాత టవల్ తో శుభ్రం చేసుకోవాలి. మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. నిమ్మరసం: నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో చర్మంపై ముడతలను తొలగించే తత్వం ఉంటుంది. నిమ్మకాయను ముక్కలుగా చేసి, మీ ముఖంపై, చర్మం ముడతలు పడిన చోట మసాజ్ చేయండి. నిమ్మకాయలో మీ చర్మాన్ని మెరిసేలా చేసే ఆమ్ల గుణాలు ఉన్నాయి. అయితే నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించవద్దు. కలబంద: కలబందలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం యొక్క సాగే లక్షణాలను పెంచుతుంది. దీని కోసం మీరు కొంత అలోవెరా జెల్ ను తీసుకుని ముడతలు పడిన చర్మంపై అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిమిషాలు ఆరనివ్వండి. ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. దీనిని విటమిన్ ఇ నూనెతో కూడా కలిపి ముఖానికి రాసుకోవచ్చు. అరటిపండు: ఆరోగ్యకరమైన ఆహారంలో, అరటి మన శరీరానికి పుష్కలంగా పోషకాలను అందిస్తుంది. దీన్ని చర్మంపై అప్లై చేయడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. బాగా పండిన అరటిపండును పేస్టులా చేసి చర్మం ముడతలు పడిన చోట రాయాలి. ఇలా దాదాపు అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి. అరటిపండులో కొద్దిగా ఆవకాడో, తేనె కలిపి రాసుకోవచ్చు. క్యారెట్: క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా చర్మంపై ముడతలను తొలగిస్తుంది. దీని కోసం మీరు క్యారెట్ పేస్ట్‌ను తయారు చేసి, ప్రతిరోజూ మీ ముఖానికి అప్లై చేయాలి. ఒకట్రెండు క్యారెట్లను తీసుకుని నీళ్లలో బాగా మరిగించి ఆ తర్వాత కాస్త తేనె కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి అరగంట ఆగి సాధారణ నీళ్లతో కడిగేస్తే ముఖంలో మెరుపు పెరుగుతుంది. ఇది కాకుండా, మీరు తరచుగా పచ్చి క్యారెట్లను తినడం అలవాటు చేసుకోవాలి. పైనాపిల్: మన చర్మ ఆరోగ్యానికి మేలు చేసే అన్ని అంశాలు పైనాపిల్ పండులో ఉంటాయి. మన చర్మం యొక్క తేమను పెంచడంతోపాటు మృతకణాలను తొలగించడం వరకు, పైనాపిల్ నుండి ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియ జరుగుతుంది . ఇది మన చర్మానికి ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను అందిస్తుంది. ఇది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మంపై గీతలు మాయమవుతాయి. పైనాపిల్ ముక్కలను నేరుగా చర్మంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఎక్కువ నీరు త్రాగాలి: నీరు ఎక్కువగా తాగడం వల్ల మన చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది. మన చర్మం మరింత తేమను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. రోజూ రెండు లీటర్ల నీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లకు చర్మంపై ముడతలు కనిపించవు.

పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను మరింత పెంచుతాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసుకోవచ్చు. * రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను కడిగేసుకోవాలి. మృత చర్మం తొలగిపోయేలా రుద్దాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచేసి.. పాదాలకు వెజిటబుల్ ఆయిల్స్‌ను రాయాలి. సాక్సులు ధరించి నిద్రించాలి. ఉదయాన్నే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. * చర్మం రఫ్‌గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దేసి.. కడిగేశాక.. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి. నిమ్మ చెక్కని పగుళ్ళకి రుద్దడం వలన కూడా పగుళ్లు తగ్గుతాయి . * పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. * గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమంతోనూ మడమల పగుళ్లను తొలగించొచ్చు. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.

దారుణమైన కండీషన్ లో ఉన్న జుట్టైనా సరే.. ఈ టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా మారిపోతుంది.. అమ్మాయిలు జుట్టు గురించి తీసుకునే శ్రద్ద బహుశా ఆరోగ్యం గురించి కూడా తీసుకోరేమో. ఒత్తుగా, పొడవుగా, మెరుస్తూ ఉండే జుట్టంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కానీ చాలా కారణాల వల్ల జుట్టు దెబ్బ తింటుంది. మెరుపును కోల్పోతుంది. విరిగిపోవడం, బూడిద రంగులోకి మారడం, చిట్లడం,  చుండ్రు వంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. ఇవన్నీ జుట్టు స్వరూపాన్ని మార్చేస్తాయి. వీటి పరిష్కారం కోసం అందరూ ఎన్నో రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయితే ఎన్ని జుట్టు సమస్యలున్నా కింద చెప్పుకునే టిప్స్ పాటించడం వల్ల జుట్టు తిరిగి ఆరోగ్యంగా, అందంగా  మారుతుంది. జుట్టురాలకుండా ఉండాలంటే.. జుట్టురాలే సమస్య ఉన్నవారు  జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి.  తలస్నానం చేయడానికి ముందు  జుట్టుకు నూనె రాయాలి. జుట్టుకు నూనె రాసిన తరువాత ఎక్కువసేపు ఉంచుకోకూడదు. కేవలం  10 నిమిషాలు మాత్రమే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చెయ్యాలి.  ప్రతి 8-10 వారాలకు ఒకసారి జుట్టు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు ప్రోత్సాహకంగా ఉంటుంది.   వారానికి ఒకసారి తలస్నానానికి ముందు తాజా ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించాలి . ఇన్ని చేసినా జుట్టు రాలుతోంటే  వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు  ఆరోగ్య సమస్యల  కారణంగా జుట్టు రాలుతుంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించం కూడా సరైనదే.. జుట్టు మెరుపు లేకుంటే.. ఫ్యాషన్ పేరుతో జుట్టుమీద ప్రయోగాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు  జుట్టును నిర్లక్ష్యం చేస్తే  జుట్టు మెరుపు కోల్పోతుంది. జుట్టుకు తరచుగా రసాయన చికిత్స చేయడం, హీట్ స్టైలింగ్ టూల్స్ వాడటం, ఇవి వాడుతూ  కండీషనర్‌ను అప్లై చేయకపోవడం వంటివి పొరపాట్లు జుట్టును నిర్జీవంగా మారుస్తాయి.  ఈ సమస్యకు మంచి పరిష్కారం ముందస్తు జాగ్రత్తలు.  హెయిర్ వాష్‌కు ముందు  జుట్టుకు పొడవునా నూనె రాయండి. వీలైతే, కనీసం నెలకు ఒకసారి హెయిర్ స్పా చికిత్సకు చేయించుకోవాలి. కుదరని పక్షంలో ఇంట్లోనే హాట్ ఆయిల్ మసాజ్, వేడి నీటిలో ముంచిన టవల్ తలకు చుట్టడం వంటివి ఫాలో కావాలి. జుట్టు మంచి కండీషన్లోకి వచ్చేవరకు జుట్టుకు వేడి, రసాయనాలు తగలకుండా జాగ్రత్త పడాలి. చుండ్రును తొలగించాలంటే.. చుండ్రులో జిడ్డు, పొడి అనే రెండు రకాలు ఉన్నాయి.  జిడ్డుగల చుండ్రును ఎదుర్కొంటున్నట్లయితే, వైద్య సహాయం అవసరమవుతుంది.  నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సందర్శించడం ఉత్తమం.  పొడి చుండ్రుతో బాధపడుతుంటే  తలస్నానానికి   సాధారణ షాంపూతో పాటు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వారానికి ఒకసారి ఉపయోగించాలి. చుండ్రు సమస్య ఉన్నప్పుడు  జుట్టును మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. జుట్టు నెరిసిపోవడాన్ని ఎలా అరికట్టాలంటే.. చిన్న వయస్సులోనే జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తే, రసాయన చికిత్సలను నివారించాలి. అదే వయసు పెరిగేకొద్ది  జుట్టు నెరిసిపోతుంటే దీనికి పరిష్కారంగా సహజమైన రంగులు లేదా గోరింటతో కవర్ చేయడం ఉత్తమ పరిష్కారం. ఎప్పుడూ మంచి బ్రాండ్ కలర్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. ఇందులో రసాయనాలు లేకుండా చూసుకోవాలి.  ఇంట్లో జుట్టుకు రంగేస్తుంటే చాలా జాగ్రత్తగా వాడాలి.                                                   *నిశ్శబ్ద.

చుండ్రును తగ్గించే తేలికైన ఉపాయాలు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల రోజు రోజుకి చుండ్రు సమస్యలు ఎక్కువైపోతున్నాయి . చుండ్రు వల్ల జుట్టు రాలిపోవటం, పేలు రావడం, దురద లాంటివి మొదలవుతాయి. ఈ సమస్యను అరికట్టాలంటే చిన్న చిన్న చిట్కాలు చేయాల్సిఉంటుంది . అవేంటో చూసేద్దాం రండి .. * వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. చుండ్రు పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు, కొద్దిగా మందారకు,కొద్దిగా కలబంద గుజ్జు ఈ మూడింటిని మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. * పిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఇందుకోసం వెనిగర్ ను, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. * కొబ్బరి నూనెతోనూ చుండ్రుని తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది. ఒకవేళ టీ ట్రీ ఆయిల్ లేకపోతే మామూలు కొబ్బరినూనె లో కొద్దిగా కర్పూరం పొడి వేసి కలిపి తలకి పెట్టుకున్న చుండ్రు తగ్గుతుంది. * తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.చుండ్రు తగ్గే వరకూ ఇలా చేయాలి. * పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ పెరుగు లో ఒక స్పూన్ మెంతి పొడి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం పూట తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

పెసరపప్పుతో ఇలా చేస్తే చాలు.. మచ్చలేని ముఖం మీ సొంతమవుతుంది.. పెసలు తెలుగు రాష్ట్రాలలో తక్కువగా ఉపయోగిస్తుంటారు. మహా అయితే పెసరట్టు, లేదంటే పులగం కోసం మాత్రమే పెసలు ఉపయోగిస్తారు. పాయసం అయినా, పొంగలి అయినా, పప్పు అయినా, సలాడ్ అయినా పొట్టుతీసిన పెసరపప్పు వినియోగిస్తారు. పెసలు గొప్ప పొష్టికాహారం మాత్రమే కాదు, శరీరంలో వేడి తగ్గించి చలువ చేస్తుంది. అయితే కేవలం ఆరోగ్య పరంగానే కాదు. సొందర్యం కోసం కూడా పెసలు అధ్బుతంగా పనిచేస్తాయి. పెసలను ఆయుర్వేదంలో  పప్పుల రాణి అని పిలుస్తారు. కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి వాటితో పోలిస్తే పెసరపప్పు ఎంతో శ్రేష్టం. ఇక పెసరపప్పును ముఖాన్ని మెరిపించడానికి ఉపయోగించవచ్చు. ముఖం మీద మచ్చలు, మంగు, నలుపు వంటివన్నీ పోయి ముఖం అందంగా తయారుకావడానికి పెసరపప్పు ఉపయోగించి తయారుచేసుకునే 5ఫేస్ ప్యాక్ లు ఉన్నాయి.  అవెలా తయారుచేసుకోవాలో తెలుసుకుంటే.. సన్ టాన్ తొలగడానికి.. సన్ టాన్ ముఖం రంగును పాడు చేస్తుంది. ఇది తొలగించడానికి పెసరపప్పు, పెరుగు పేస్ ప్యాక్ వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన పెసరపప్పు పొడి నాలుగు స్పూన్లు, పెరుగు రెండు స్పూన్లు తీసుకోవాలి. రెండింటిని మిక్స్ చేసి ముఖానినకి పేస్ ఫ్యాక్ వేసుకోవాలి. 10నిమిషాల తరువాత దీన్ని కడిగేసుకోవాలి. సన్ టాన్ తొలగడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది. అవాంఛిత రోమాలు తొలగడానికి.. ముఖం మీద అవాంచిత రోమాలు ఉన్నట్టేతే ఈ పేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల వాటిని తొలగించుకోవచ్చు. నాలుగు స్పూన్ల పెసరపప్పును నానబెట్టాలి. బాగా నానిన తరువాత వీటిని గ్రైండ్ చేయాలి. ఇందులో రెండు స్పూన్ల నారింజ తొక్కల పొడి, రెండు స్పూన్ల గంధపు పొడి  కలపాలి. ఇది బాగా గట్టిగా ఉంటే ఇందులో కాసిన్ని పాలు జోడించాలి. మందంపాటి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖం మీద పట్టించి 10నిమిషాల తరువాత దీన్ని రబ్ చేస్తూ తొలగించాలి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖం మీద అవాంచిత రోమాలను తొలగిస్తుంది. డ్రై స్కిన్ కోసం.. డ్రై స్కిన్ ఉన్నవారు ఏ పేస్ ప్యాక్ వాడితే ముఖం అందంగా మారుతుందనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టిన పెసరపప్పును గ్రైండ్ చేయాలి. దీంట్లో కొద్దిగా పచ్చిపాలు వేయాలి. ఒకవేళ పెసరపప్పు గ్రైండ్ చేసేటప్పుడే పాలు జోడించవచ్చు. దీన్ని మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15నిమిషాల తరువాత ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్ డ్రై స్కిన్ ఉన్నవారికి చక్కని ఫలితాన్ని ఇస్తుంది.  ముఖ చర్మాన్ని తేమగా,మృదువుగా మారుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడానికి..  వాడిపోయిన చర్మాన్ని తిరిగి తాజాగా, కాంతివంతంగా మార్చడంలో ఈ ఫేస్ ప్యాక్ సమర్థవంతంగా పనిచేస్తుంది. నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును గ్రైండ్ చేయాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పేస్ ప్యాక్ వేసుకోవాలి. 15నిమిషాల తరువాత ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది. ముఖానికి కాంతిని ఇస్తుంది. మొటిమలు తగ్గడానికి.. చాలామందికి మొటిమలు ప్రధాన సమస్య. ఈ సమస్య తొలగడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. 4స్పూన్ల పెసరపప్పు పేస్ట్ లో రెండు స్పూన్ల నెయ్యి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత ముఖం కడిగేయాలి. దీన్ని రెగులర్ గా ఫాలో అవుతూ ఉంటే ముఖం మీద మొటిమలు, మచ్చలు, మంగు వంటివన్నీ తొలగిపోతాయి. ముఖం చాలా తాజాగా కనిపిస్తుంది. (Note: ఇంట్లోనే మెత్తగా  గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు  పొడి అయినా వాడచ్చు. లేదా.. నానబెట్టిన పెసరపప్పు ను గ్రైండ్ చేసుకుని అయినా ఈ పేస్ ప్యాక్ లలో ఉపయోగించుకోవచ్చు.)                                 *నిశ్శబ్ద.

నెయిల్ పాలిష్ రిమూవర్ లేకుండా నెయిల్ పెయింట్ తొలగించుకోవచ్చు..  అమ్మాయిల అందానికి బోలెడు అలంకారాలు. వీటిలో దుస్తులు, నగలు, పాదరక్షల దగ్గర నుండి దుస్తులకు వేసుకుని పిన్నులు, జడలకు వేసుకుని క్లిప్పుల వరకు బోలెడు ఉంటాయి. ఇక చేతులు అందంగా కనిపించడం కోసం, బయటకు పార్టీలకు వెళ్లినప్పుడు అట్రాక్షన్ గా ఉండాలని గోళ్ళకు  నెయిల్ పాలిష్ వేస్తుంటారు. ఈ రోజుల్లో బట్టలకు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకునే ట్రెండ్ ఎక్కువైంది. నెయిల్ పాలిష్ వేయడం చాలా సులభం, కానీ దానిని తొలగించేటప్పుడు చాలా కష్టం. డ్రస్ మార్చిన ప్రతిసారి నెయిల్ పాలిష్ మార్చడం చాలామందికి సమస్యగా ఉంటుంది. కారణం నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా నెయిల్ పాలిష్ అంత ఖరీదైనదే.. భీభత్సంగా వాడితే అది మాత్రం అయిపోకుండా ఉంటుందా ఏంటి? అయితే  గోళ్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ కింది ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలు.. టూత్‌పేస్ట్.. పళ్లు తోమడానికి ఉపయోగించే టూత్‌పేస్ట్  గోళ్లకున్న పాత నెయిల్ పాలిష్ తొలగించడంలో  కూడా ఉపయోగించవచ్చు.  ఇందుకోసం గోళ్లపై టూత్‌పేస్ట్‌ను రాసి లైట్ గా  బ్రష్ సహాయంతో గోళ్లను తేలికగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ తొలగిపోతుంది. టూత్‌పేస్ట్,  బేకింగ్ సోడా.. టూత్‌పేస్ట్‌లో బేకింగ్ సోడా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని  గోళ్లపై రాస్తే పాత నెయిల్ పాలిష్ చాలా సులువుగా  తొలగిపోతుంది. వేడి నీరు..  వేడి నీటి సహాయంతో నెయిల్ పాలిష్‌ను తొలగించుకోవచ్చు. ఇందుకోసం కొంచెం నీటిని ఒక పాత్రలో వేడి చేయాలి.  తరువాత వేళ్లను  గోరు వెచ్చని నీటిలో 25-30 నిమిషాలు ఉంచాలి. ఇది ఓపికతో కూడుకున్నది అయినా గతిలేని పరిస్థితిలో కచ్చితమైన ఫలితాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది.  ఇలా ఉంచితే క్రమంగా నెయిల్ పెయింట్ దానంతట అదే రాలిపోతుంది. నిమ్మరసం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉపయోగించడం  ద్వారా కూడా గోళ్ళకు ఉన్న  నెయిల్ పాలిష్‌ను వదిలించుకోవచ్చు. నిమ్మరసం కలిపిన నీళ్లలో గోళ్ళను ముంచాలి. ఇలా కొద్దిసేపు ఉంచితే  నెయిల్ పాలిష్ పోవడమే కాదు గోర్లు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి. వెనిగర్  నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి వెనిగర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం వెనిగర్‌లో నిమ్మరసం మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే  నెయిల్ పాలిష్ ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది.                                                           *నిశ్శబ్ద.

మీ అందాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు.. అందమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. స్పాట్‌ లెస్‌ బ్యూటీ సొంతం చేసుకోవడానికి.. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్స్‌ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్‌లు వాళ్ల చర్మతత్వానికి సరిపోతాయో? లేదో అన్న విషయం గురించి కూడా ఆలోచించరు. ఇలా ఏదిపడితే అది బ్యూటీ కేర్‌లో యాడ్ చేసుకుంటే.. చర్మ సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది. మీరు మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 1. మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడానికి.. రోజూ బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవడం తప్పనిసరి. సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది . మీ చర్మాతత్వానికి సరిపోయే సన్ స్క్రీన్ ని సరైన స్కిన్ కేర్ నిపుణులను అడిగి తెలుసుకుని మరి వాడండి .. ఏవి పడితే అవి వాడకూడదు .. దాని వల్ల మీ స్కిన్ డామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండాలి . 2. స్క్రబింగ్‌ వల్ల చర్మంపై పేరుకున్న మురికి, డెడ్‌ సెల్స్‌, టాక్సిన్స్‌ తొలగుతాయి. స్క్రబ్‌ ద్వారా చర్మంపై పేరుకొన్న మృతకణాలతో పాటు, దుమ్ము, ధూళి కూడా సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్‌ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మగ్రంథులు తెరుచుకుని శుభ్రపడతాయి. అందుకే వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్‌ చేసుకుంటే.. చర్మం తాజా మారుతుంది. మొటిమలు ఎక్కువగా ఉంటే.. స్క్రబ్‌ చేయవద్దు. 3. నిద్ర లేవగానే, నిద్రపోయే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయేటప్పుడు మన ముఖంపై పేరుకునే బ్యాక్టీరియాను తొలగించాలంటే ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు మేకప్‌ని పూర్తిగా తొలగించి శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. 4. కొంతమంది ముఖం శుభ్రం చేసుకునేప్పుడు, రఫ్‌గా హ్యాండిల్‌ చేస్తూ ఉంటారు. గోళ్లతో గీరుకోవడం, ముఖాన్ని గట్టిగా రుద్దుకోవడం వల్ల.. చర్మ కణాలు దెబ్బతింటాయి. ఇలా చేయడం వల్ల మీ అందం దెబ్బ తింటుంది. మీ చర్మాన్ని సున్నితంగా ట్రీట్‌ చేయాలి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. 5. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మీ డైట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌, విటమిన్‌ ఈ, ఏ, సీ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. బాదం, వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఈ సమృద్ధిగా ఉంటుంది. 6. ఒత్తిడి, ఆందోళనలు అందంపై ప్రభావం చూపుతాయి. టెన్షన్‌ పడినప్పుడు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా జరిగే శారీరక మార్పుల వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్ట్రెస్‌ కారణంగా.. పిగ్మెంటేషన్‌, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సమయం గడపండి.