ఇడుక్కిలో వెంకటేష్ కష్టాలు
on Mar 20, 2014
వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం "దృశ్యం". మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కేరళలోని ఇడుక్కి అనే ప్రాంతపరిసరాల్లో జరుగుతుంది. దాదాపు మలయాళ ఒరిజినల్ షూటింగ్ జరుపుకున్న ప్రాంతాల్లోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై.లిమిటెడ్ మరియు ఏంజిల్ క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నదియా, ఎస్తర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.