ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన రజనీ..!
on Jun 7, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ను అభిమానిస్తారనటం కంటే ఆరాధిస్తారు అనడం కరెక్ట్. ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా, కబాలీ ఆడియో వేడుకలో తమ హీరోను చూద్దామని ఆశలు పెట్టుకున్నారు. మూవీ టీం కూడా, జూన్ మొదటివారంలో ఆడియోను, జూలై 1న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ వేశారు. అయితే తాజాగా ఆడియో ఫంక్షన్ ను క్యాన్సిల్ చేసి, పాటల్ని డైరెక్ట్ గా రిలీజ్ చేసేయాలని కబాలీ టీం డిసైడ్ అయ్యారట.
రజనీ లాంటి స్టార్ సినిమాకు ఆడియో ఫంక్షన్ చేయకపోయినా హైప్ ఏమీ తగ్గదు అనేది వాళ్ల అభిప్రాయంలా కనిపిస్తోంది. జూన్ 12న కబాలీ ఆడియో మార్కెట్ లోకి ఎంటరవనుంది. అయితే ఈ డెసిషన్ రజనీ అభిమానుల్ని డిజప్పాయింట్ చేసింది. సినిమాకు ఇంకా నెలరోజుల టైం ఉండటంతో, తమ హీరోను ఈలోపుగానే ఆడియోలో చూడచ్చు, మాటలు వినచ్చు అనుకున్న వీరాభిమానులందరూ కాస్త నిరాశకు గురయ్యారు. జూలై 1 న రిలీజ్ కాబోతున్న కబాలీ తెలుగు రైట్స్ ను షణ్ముఖ పిక్చర్స్ సంస్థ 29 కోట్ల భారీ ఎమౌంట్ ఇచ్చి దక్కించుకోవడం విశేషం.