రవితేజ నోట `ఖిలాడి` పాట.. డీఎస్పీ కాంబోలో ఫస్ట్ టైమ్
on Dec 8, 2021
మాస్ మహారాజా రవితేజ మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి గాయకుడు కూడా. `పవర్` చిత్రంలో ``నోటంకి నోటంకి`` అంటూ ఓ పూర్తిస్థాయి పాట పాడి తన గాత్రంతో అలరించారాయన. అలాగే, ఆ ఆల్బమ్ కి చార్ట్ బస్టర్ ఇచ్చారు. ``నోటంకి నోటంకి``కి ముందు, తరువాత `బలుపు`, `రాజా ది గ్రేట్`, `డిస్కో రాజా` చిత్రాల కోసం కూడా గొంతు సవరించుకున్నారు రవితేజ.
బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో రవితేజ సందడి!
ఇదిలా ఉంటే.. తన తదుపరి చిత్రం `ఖిలాడి` కోసం మరోసారి పాట పాడనున్నారట మాస్ మహారాజా. సినిమాలో కీలక సందర్భంలో వచ్చే ఈ గీతాన్ని రవితేజ పాడితేనే బాగుంటుందని చిత్ర దర్శకుడు రమేశ్ వర్మ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ చెప్పడంతో.. రవితేజ కూడా పాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే ఈ పాట రికార్డ్ కాబోతుందని సమాచారం. మరి.. డీఎస్పీ కాంబోలో ఫస్ట్ టైమ్ రవితేజ పాడనున్న ఈ గీతం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
కాగా, రవితేజ ద్విపాత్రాభినయం చేసిన `ఖిలాడి`లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నాయికలుగా నటించారు. అర్జున్, అనసూయ, ఉన్ని ముకుందన్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, సచిన్ ఖేద్కర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 2022 ఫిబ్రవరి 4న `ఖిలాడి` థియేటర్స్ లో సందడి చేయనుంది.