వెంకీని రాధగా చేయనున్న మారుతి
on Oct 30, 2013
ప్రస్తుతం వెంకటేష్ నటించిన "మసాలా" చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. అదే విధంగా కృష్ణవంశీ దర్శకత్వంలో కూడా ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు. అయితే వెంకటేష్ హీరోగా మరో చిత్రం తెరకెక్కనున్నది. మారుతి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి "రాధ" అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా బ్యానర్ లో నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారు. ఈ చిత్రంలో వెంకీ సరసన నయనతారను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం "కొత్త జంట" చిత్రం షూటింగ్ తో పాటు, "రాధ" చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు దర్శకుడు మారుతి.