"గౌరవం"లో వరలక్ష్మి
on Jan 20, 2012
"గౌరవం"లో వరలక్ష్మి హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే "గగనం" ఫేం రాధామోహన్ దర్శకత్వంలో యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నటించబోయే "గౌరవం" చిత్రంలో వరలక్ష్మి హీరోయిన్ గా నటించనుందని తెలిసింది. ఈ వరలక్ష్మి ఎవరూ అంటే నటి రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ కూతురే ఈ వరలక్ష్మి. ఈ వరలక్ష్మి విద్యాధికురాలు. నటన మీద ఆసక్తితో తల్లిదండ్రుల అనుమతితో వరలక్ష్మి సినీ రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.
ముందుగా తమిళ సినీ రంగంలో తెరంగేట్రం చేసింది ఈ వరలక్ష్మి. ఈమెతో "గౌరవం" చిత్ర నిర్మాత మంతనాలు జరుపుతున్నారట. అదే గనక ఒ.కె. అయితే గౌరవం" చిత్రంలో వరలక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. అన్నట్టు ఈ "గౌరవం" చిత్రానికి ప్రముఖ నటుడు, సినీ రచయిత తనికెళ్ళ భరణి మాటలు వ్రాయటం విశేషం.