ప్రిన్స్ హీరోగా సుకుమార్ చిత్రం మార్చ్ నుండి
on Feb 13, 2012
ప్రిన్స్ హీరోగా సుకుమార్ చిత్రం మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, రామ్ ఆచంట, అనీల్ సుంకర, గొపీనాథ్ ఆచంట నిర్మిస్తున్న చిత్రం, ఫిబ్రవరి 12 వ తేదీన హైదరాబాద్ లోని రామానాయుడు స్టుడియోలో లాంఛనంగా ప్రారంభమయ్యింది.
ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నెల నుండి ప్రారంభం అవుతుందట. ఈ చిత్రానికి యువసంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ విధంగా మహేష్ బాబు సినిమాకి తొలిసారిగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.