Read more!

English | Telugu

సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఎవరు?

సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఎపిసోడ్ ఫైనల్స్ కి చేరుకుంది. ఈ షో ఎంతోమందికి మంచి వేదికను అందించింది. ఈ షో ద్వారా పార్వతి అనే అమ్మాయి తన ఊరుకు బస్సు వేయించుకుంది కూడా. ఐతే ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మస్త్ కలర్ ఫుల్ గా చేశారు మేకర్స్. ఈ షోకి శృతి హాసన్ గెస్ట్ గా వచ్చి ఎంటర్టైన్ చేయబోతోంది. ఇక ఈ ఎపిసోడ్ కి వెటరన్ సింగర్ పి.సుశీలమ్మను సగౌరవంగా సన్మానించడానికి ఒక అందమైన వేదికను కూడా సిద్దమయ్యింది. దక్షిణ భారత దేశంలో ఎంతో గొప్ప గాయనీమణుల్లో సుశీలమ్మ ఒకరు. 1960ల నుంచి ఆరు భారతీయ భాషల్లో  17,600 పాటల పాడి ఆడియన్స్ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే  పద్మభూషణ్ అవార్డు గ్రహీత సుశీలమ్మ. ఈమె  5 జాతీయ అవార్డులను, ఇంకా ఎన్నో రాష్ట్ర అవార్డులను కూడా అందుకున్నారు. అలాగే ఆమె పేరు  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండిట్లో పేరు నమోదు చేసుకుంది. 

ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో సుశీలమ్మను కలిసే ఆ ఆనంద క్షణాల కోసం ఫైనలిస్టులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే కోటి, రఘు కుంచె, యాక్టర్స్ నితిన్, కృతి శెట్టి, నిహారిక కొణిదెల ఈ ఎపిసోడ్ లో కనిపించి అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రాండ్ ఫినాలే ఆగస్టు 14 ఆదివారం నాడు ప్రసారం కానుంది. సరిగమప సీజన్ 14 ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. దీనిని శ్రీముఖి హోస్ట్ గా చేస్తుండగా  న్యాయనిర్ణేతలుగా కోటి, ఎస్పీ శైలజ, అనంత శ్రీరామ్, స్మిత ఉన్నారు. అలాగే ఈ షోలో గీతా మాధురి, సాకేత్, అరుణ్, రేవంత్ అనే నలుగురు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు.   ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఈ సీజన్‌కు న్యాయనిర్ణేతగా వచ్చారు. స్మిత ఈ సింగింగ్ షోతో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు యశస్వి కొండేపూడి, రేణు కుమార్ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్స్ గా నిలిచి మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సీజన్ సింగింగ్ సూపర్ స్టార్ ఎవరు అనే విషయంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.