English | Telugu

ఈ సీజ‌న్ విన్న‌ర్ అత‌నేనా? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌!

బిగ్ బాస్ సీజ‌న్ 5 రియాలిటీ షో క్లైమాక్స్‌కి చేరుకుంది. దీంతో ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ చ‌ర్చ‌లో ఎవ‌రికి న‌చ్చిన వ్య‌క్తిని వారు విన్న‌ర్ అంటూ చెప్ప‌డం మొద‌లుపెట్టారు. ష‌ణ్ముఖ్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ఫైన‌ల్ డేన ష‌ణ్ణు టైటిల్ విన్న‌ర్‌గా నిల‌వ‌డం.. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ ట్రోఫీని అందుకుంటున్న‌ట్టుగా పిక్స్‌ని మార్ఫింగ్ చేసి నెట్టింట ప్ర‌చారం మొద‌లుపెట్టారు.

Also read:`బిగ్‌బాస్‌` నుంచి ఆమె ఎలిమినేట్‌!

గ‌త సీన్ విజేత అభిజీత్ ఫొటోల‌ని మార్ఫింగ్ చేసి ఆ ఫొటోల్లో ష‌ణ్ణుని చేర్చి ఆ ఫొటోల‌ని నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. ఇదిలా వుంటే మెజారిటీ వ‌ర్గం ఆడియ‌న్స్ టాక్ మాత్రం మ‌రోలా వుంది. .జెన్యూన్‌గా ఆడుతున్న కంటెస్టెంట్ ఈ సీజ‌న్ విజేత‌గా నిల‌వ‌బోతున్నాడ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతున్నారు. ప‌బ్లిక్ యునానిమ‌స్‌గా ఈ సీజ‌న్ విన్న‌ర్ అని చెబుతున్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు స‌న్నీ. స‌న్నీ టాస్క్‌ల‌లొ ఫైర్‌గా , అగ్రెసీవ్‌గా క‌నిపించినా త‌ను ఎలాంటి యాక్టింగ్ చేయ‌డం లేద‌ని, త‌న‌కు ఏం అనిపించిందో అది నిజాయితీగా చేస్తున్నాడ‌ని.. గేమ్ పూర్త‌యిన త‌రువాత గేమ్‌లో జ‌రిగిన‌వ‌న్నీ ప‌క్క‌న పెట్టి చాలా స‌ర‌దాగా వుంటున్నాడని ప్రేక్ష‌కులు చెబుతున్నారు.

Also read:ఓట‌మి భ‌యంలో ష‌న్ను.. స‌న్నీ ఫ్యాన్స్‌పై కామెంట్స్‌

తాజాగా ఓ మీడియా నిర్వ‌హించిన ప‌బ్లిక్ టాక్ లో మెజారిటీ వ‌ర్గం స‌న్నీపై ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డంతో స‌న్నీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా స‌న్నీనే నిలిచే అవ‌కాశాలు వున్నట్టుగా ఓటింగ్ స‌ర‌ళి కూడా తెలియ‌జేస్తోంది. టిక్కెట్ టు ఫినాలే ని శ్రీ‌రామ‌చంద్ర సొంతం చేసుకోవ‌డానికి కార‌ణం ఇటీవ‌ల జ‌రిగిన ఐస్ బౌల్ టాస్క్‌. ఈ టాస్క్ త‌రువాత ప్రియాంక చేసిన సొంత వైద్యం కార‌ణంగా శ్రీ‌రామ చంద్ర న‌డ‌డానికి ఇబ్బందిప‌డిన విష‌యం తెలిసిందే. అదే అత‌న్ని టిక్కెట్ టు ఫినాలేలోకి ఎంట‌ర్ అయ్యేలా చేసింద‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఓవ‌రాల్‌గా మాత్రం స‌న్నీనే ఈ సీజ‌న్ విజేత అని మెజారిటీ వ‌ర్గం ప్రేక్ష‌కులు చెబుతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.