English | Telugu

ఇట్లు మీ ‘రిషిధార’.. సెకండ్ పార్ట్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా

గుప్పెడంత మనసు సీరియల్ ఐపోవడం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘రిషిధార’ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఈ సీరియల్ లో రిషి, వసుధార బాగా సెట్ అయ్యారు. దాంతో ఆడియన్స్ కి వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ నటన చాలా సహజంగా అనిపించేలా ఉంటుంది. ఏదో సీరియల్ చేస్తున్నట్టుగా కాకుండా, ఇంట్లో మనుషుల్లా అనిపిస్తారు వీళ్ళు అందుకే వీళ్ళను ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్నారు.

ఐతే రీసెంట్ గా వీళ్ళు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్‌తో మళ్లీ వస్తానంటూ మాటిచ్చింది వసుధార. సీరియల్ ఐపోవడం తనకు ఎంతో బాధకలిగిస్తోందని చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ అందుబాటులో ఉంటాను అని చెప్పింది. ఈ సీరియల్ అయిపోతుందని తెలిసి తనకు ఒక కేక్ పంపించారట అభిమానులు. దాంతో పాటు ఒక బాక్స్ కూడా ఉందని చెప్పింది. ఐతే ఈ సీరియల్‌లో వసు ఎప్పుడూ నెమలి ఈకలు పుస్తకాల్లో పెట్టుకుని తిరుగుతూ ఉండడం మనం చూసాం. ఐతే చాలా సార్లు ఈ విషయం గురించి తన డైరెక్టర్‌ని అడిగేదాన్ని అని చెప్పింది. ఐతే ఇప్పుడు తన ఫాన్స్ కేక్‌పై కర్చీఫ్, గోలీలు, నెమలి ఈకలు, కాఫీ, పుచ్చకాయ, కొబ్బరి బొండం ఇవన్నీ పెట్టి పంపించారు షూటింగ్ లాస్ట్ డే ఇవన్నీ చూసేసరికి ఆడియన్స్‌కి ఇవన్నీ ఎంత కనెక్ట్ అయ్యాయో తెలిసిందని చెప్పుకొచ్చింది. ఈ సీరియల్ షూటింగ్ ఎప్పుడూ ఎంతో సందడిగా సాగుతూ ఉంటుంది అని చెప్పింది. ఆ సందడి మిస్ అవుతున్నందకు బాధగా ఉంది కానీ మళ్లీ కలుస్తాననే హోప్ ఉంది అంటూ చెప్పింది.


Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.