English | Telugu
Brahmamudi: కొంపముంచిన DNA.. భర్తకి భార్య సవాల్!
Updated : Nov 26, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -263 లో... స్వప్న తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందని నింద వేసి, తనని ఎలాగైనా ఇంట్లో నుండి బయటకు పంపించాలని రాహుల్ , రుద్రాణి ప్లాన్ చేస్తారు. నాకెవరు అడ్డు చెప్పకండని రుద్రాణి ఇంట్లో వాళ్ళకి చెప్పి స్వప్నని బయటకు గెంటేయ్యబోతుంటే స్వప్న కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో రాజ్ డాక్టర్ కి కాల్ చేసి రమ్మని చెప్తాడు.
ఆ తర్వాత డాక్టర్ వచ్చి స్వప్న ని చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పగానే.. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రుద్రాణి మాత్రం ఇది మరొక నాటకమా అని అంటుంది. ఆ తర్వాత డాక్టర్ ని రుద్రాణి అడుగుతుంది.. డాక్టర్ నేను చెప్పేది నిజమని చెప్పగానే.. రాహుల్ కూడా స్వప్న నిజంగానే ప్రెగ్నెంట్. కానీ ఆ బిడ్డకి తండ్రిని మాత్రం నేను కాదని అనగానే అందరూ షాక్ అవుతారు. స్వప్న రాహుల్ అలా అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది. నేను తప్పు చేసాను కానీ తప్పుడు మనిషిని కాదని స్వప్న చెప్తుంది. రుద్రాణి కూడా ఎవరి బిడ్డకు నా కొడుకుని తండ్రిని చెయ్యాలని చూస్తున్నావా అని అంటుంది. నేను అరుణ్ కి డబ్బులు ఇచ్చన మాట నిజమే కానీ నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. రిచ్ గా బతకాలని అనుకుంటాను. కానీ రిచ్ గా ఉండడానికి తప్పుడు పనులు చేస్తానని అనుకోకండి. ఇది నా వ్యక్తిత్వం, నా క్యారెక్టర్ కీ సంబంధించినదని స్వప్న ధైర్యంగా మాట్లాడుతుంది. మరొకవైపు స్వప్నకి కావ్య సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. నాకు ఈ సమస్యని పరిష్కారించుకునే దైర్యం ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండని కావ్యతో స్వప్న అంటుంది. "ఒక ఆడదానివై ఉండి. ఇంత మంది ముందు నా శీలాన్ని అనుమానిస్తావా? నా కడుపులో బిడ్డ నాకూ అండగా ఉంది. ఎంత దూరం అయిన వెళ్తాను. DNA టెస్ట్ చేయిస్తాను. అప్పుడు అందులో నేను తప్పు చేశానని తెలిస్తే నా అంతట నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను" అని ఇంటి పెద్దలకి నిరూపించుకునే అవకాశం ఇవ్వమని స్వప్న కోరుకుంటుంది. ఆ తర్వాత ఆలోచించిన సీతారామయ్య .. ఇలా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు నిజానిజాలు తెలియకుండా నిందలు వెయ్యకండని రాహుల్, రుద్రాణిలకి చెప్తాడు.
మరొకవైపు ఎందుకు ఇలా చేసావ్? స్వప్నని ఇంట్లో నుండి బయటకు పంపించాలని ప్రయత్నం చేస్తుంటే ఒక వైపు తల్లిని చేసావా అంటూ రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది రుద్రాణి. ఆ DNA టెస్ట్ లో రిపోర్ట్స్ మనకి అనుకూలంగా వచ్చేలా మనం చెయ్యాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని రాజ్ అంటాడు. నిజం తెలియకుండా నిందలు వెయ్యడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది. స్వప్న పెళ్లి తర్వాత అరుణ్ తో పరిచయం రహస్యంగా ఉంచడం, అతనితో మాట్లాడటం నేను చూసానని రాజ్ అంటాడు. ఆ నిజాన్ని నేను వెలికి తీస్తాను. అది నింద. నింద మాత్రమే అని బుజువు చేస్తాను. ఇది మా అక్క కోసం మాత్రమే చేస్తున్నా పోరాటం కాదు. ఒక స్త్రీ చాలా సులభంగా పరాయి మగవాడికి లొంగిపోతుందని అనుకుంటున్న మీలాంటి మగవారికి గుణపాఠం నేర్పడానికి కూడా అని రాజ్ కి కావ్య ఛాలెంజ్ విసురుతుంది.