English | Telugu

పొలిటికల్ గా ట్రోల్స్ చేయొద్దంటు సుప్రిత ఎమోషనల్ పోస్ట్!


తెలంగాణలో నిన్న జరిగిన ఎలక్షన్ ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలవడంతో అతడిని కలిసిన ఫోటోని సుప్రిత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో సురేఖావాణి, రేవంత్ రెడ్డి, సుప్రిత ఉన్నారు. అయితే ఆ తర్వాతి పోస్ట్ లో బీఆర్ఎస్ మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ట్యాగ్ చేస్తూ.. మేం చూసిన బెస్ట్ ఐటీ మినిస్టర్ మీరే సర్ అనే మెమీ పోస్ట్ ని షేర్ చేసింది.

టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విష‌యాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె. అయితే రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే సుప్రిత ఇప్పుడు పొలిటికల్ గా వైరల్ అవుతుంది.

ఇన్ స్టాగ్రామ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విష్ చేసిన సుప్రితకి అనుకోని విధంగా.. విమర్శలు, ట్రోల్స్ వచ్చాయంట. దానికి సుప్రిత తీవ్రంగా భాదపడుతు ఒక పోస్ట్ ని అభిమానులతో పంచుకుంది. " నేను మీకు ఏం చేశాను. ఎందుకు నన్ను‌ ట్రోల్స్ చేస్తున్నారు. నన్ను ఎందుకు ట్యాగ్ చేస్తూ పొలిటకల్ గా దూషిస్తూ ఇలా చేస్తున్నారెందుకు. నేను బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశాను. ఆ పోస్ట్ లో పోస్ట్ కొత్త సీఎమ్ ని విష్ చేసానంతే. ఎందుకిలా చేస్తున్నారు. మీరు చేసే ఈ హరాజ్ మెంట్ వల్ల ఒక వ్యక్తి మెంటల్ హెల్త్ ఎంతలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసా.. ఎంత‌ బాధపడుతున్నానో తెలుసా" అంటూ పోస్ట్ ని షేర్ చేసింది సుప్రిత.‌ కాగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.