English | Telugu
సింగర్ సునీత నోటా అల్లు అర్జున్ డైలాగ్....15 న డాలస్ లో ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్
Updated : Jul 13, 2023
సింగర్ సునీత పాట పాడినా, మాట్లాడినా వినబుద్దేస్తుంది. తెలుగు సింగెర్స్ లో సునీతకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కేవలం సింగింగే కాదు డబ్బింగ్ కూడా చెప్తారు. మ్యూజిక్ ఈవెంట్స్లో హోస్ట్గా, యాంకర్గా కూడా ఈమె సందడి చేస్తారు. ఈమె లైఫ్ ఒక ఓపెన్ బుక్...పాటలు పాడటంతో పాటు సింగింగ్ షోస్ కి జడ్జిగా ఉంటుంది. అలాంటి సునీతకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆకాష్, కూతురు శ్రేయ. కొడుకు ఆకాష్ ని హీరోని చేసేసారు సునీత..త్వరలో అతను నటించిన "సర్కార్ నౌకరి" ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక కూతురిని కూడా సింగర్ గా చేసేసారు సునీత. ఆమె ఆల్రెడీ నాగచైతన్య నటించిన "సవ్యసాచి" మూవీలో " టిక్ టిక్ టిక్అ "నే పాటను పాడారు కూడా. ఇక సునీత-శ్రేయ కలిశారంటే అల్లరి మాములుగా ఉండదు.
ఇప్పుడు కూడా అలా సరదాగా చేసిన ఒక రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు సునీత. అల్లు అర్జున్ మూవీలోని ఒక ఫేమస్ డైలాగ్ ఐన "ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా" అనేదాన్ని సునీత చేత వాళ్ళ అమ్మాయి శ్రేయ చెప్పించింది. ఆ వీడియోని అల్లు అర్జున్ పిక్ తో కొలెజ్ చేసి "మేడం భలే ముద్దుగా చెప్పారు కదా డైలాగ్" అని కాప్షన్ రాసి పోస్ట్ చేశారు. ఇక సునీత ఇన్స్టా పేజీ మొత్తం చూస్తే వాళ్ళ పిల్లలు, పూలు, పాటలు ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈమె ఇళయరాజా గారితో కలిసి 15 న డాలస్ లో ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా చేయబోతున్నారు. సునీత కుమార్తె శ్రేయ అచ్చం అమ్మలాగే ఎంతో అందంగా ఉంటుంది. అద్భుతమైన స్వరాన్ని సొంతం చేసుకున్న శ్రేయ.. ఫ్యూచర్ లో సింగర్గా రాణిస్తుందో.. హీరోయిన్గా మెప్పిస్తోందో చూడాలి. సునీత తన పిల్లలతో ఉన్న ప్రతీ మూమెంట్ ని అలాగే తన పర్సనల్ అప్ డేట్స్ ని తన కన్సర్ట్స్ కి సంబంధించిన విషయాలను కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు.