English | Telugu

హోస్టింగ్ నేను చేస్తే బాగుంటుందన్నారు.. ప్రదీప్ చేంజ్ అవలేదన్న నిధి!

బిబి జోడి సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "ఇక నుంచి మీ సండే నైట్స్ ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా మారబోతున్నాయి. ఎందుకంటే మా బిబి జోడి సీజన్ 2 లో ధమాకా జోడీలు దుమ్ము దులపడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.

"ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లు వస్తుంటాయి" అంటూ ప్రదీప్ మానస్ జోడీకి చెప్తుండగా మణికంఠ మధ్యలో వచ్చి "హోస్టింగ్ నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు" అంటూ మణికంఠ చెప్పాడు. "నువ్వు వేరే వాళ్ళ అకౌంట్ లో కామెంట్స్ చదివి ఉంటావ్" అన్నాడు ప్రదీప్. "మీరింత బాగా డాన్స్ చేస్తారని తెలీదు. మా దాంట్లో ఐటెం సాంగ్ ఉంది చేస్తారంటే " అంటూ ధనరాజ్ ఒక విషయం చెప్పేసరికి మానస్ "వ్వావ్" అన్నాడు. జడ్జ్ శ్రీదేవి అతని ఎక్స్ప్రెషన్ చూసి "ఒకసారి మళ్ళీ చూపించండి ఆ ఎక్స్ప్రెషన్" అని అడిగింది. "వ్వావ్ చాలా ఉంది ధమాకా జోడీస్ కి" అని కౌంటర్ ఇచ్చింది.

తర్వాత స్టేజి మీదకు రాజా సాబ్ ముగ్గురు హీరోయిన్స్ వచ్చారు. "కొత్త సంవత్సరం జాతకంలో మంచి కలర్ ఫుల్ గా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను" అంటూ బాగా ఫ్లర్ట్ చేసాడు. "ప్రదీప్ గారు మీరేం చేంజ్ అవలేదు కదా " అంటూ నిధి అగర్వాల్ ప్రదీప్ మీద డైలాగ్ వేసింది. "అస్సలు చేంజ్ అవలేదు" అంటూ శేఖర్ మాష్టర్ కోరస్ ఇచ్చాడు. "కానీ మీరు అందరికీ సేమ్ థింగ్ చెప్తారు" అంటూ నిధి మళ్ళీ ప్రదీప్ మీద కౌంటర్ వేసింది.

తర్వాత "బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్" థీమ్ మీద మానస్ - స్రష్టి వర్మ చేసిన డాన్స్ కి జడ్జెస్ ఫిదా ఇపోయారు. జడ్జ్ శ్రీదేవి గోల్డెన్ రోజ్ ఇచ్చింది. ఈ థీమ్ కి పక్కా న్యాయం చేశారు అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.