English | Telugu

తన అందానికి కారణం అది తినడమేనట

రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫాన్స్ తో బాతాకాని కూడా వేస్తుంది, ఆన్సర్స్ ఇస్తుంది. ఇప్పుడు కూడా రండి క్వశ్చన్స్ అడగండి అని పిలిచింది. కొంతమంది కొంటె నెటిజన్స్ కి మాత్రం తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఆన్సర్స్ చెప్పేసింది. "నన్ను పెళ్లి చేసుకుంటావా" అంటే "నో" అంది. " నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి ఎవరికీ తెలియనిది" అనేసరికి "చెప్పనుగా" అంది. "ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా" అనడంతో "నో" అని చెప్పి పారిపోయే ఎమోజిస్ ని పోస్ట్ చేసింది. "తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో ఇష్టం" "నాగ చైతన్య, జూ.ఎన్టిఆర్, నాగార్జున, అల్లు అర్జున్, ఇంకా ఉన్నారు" అని సిగ్గుపడుతూ చెప్పింది.

"నువ్వు ఎం తింటావ్ అంతా స్మార్ట్ గా ఉంటావ్" అనేసరికి "బ్రెయిన్ తింటాను" అని సరదాగా తన అందం వెనక ఉన్న సీక్రెట్ ని చెప్పేసింది. "నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి" అని అడగడంతో "యూనివర్స్ ఎక్కడికి పంపిస్తే అక్కడే ఉఫ్ మని ఎగిరిపోతా" అని చెప్పింది. "నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఒక మెసేజ్ చేయండి..చేస్తారా" అని అడిగేసరికి "చెయ్యను" అని అంది. "మీరు అంత అందంగా ఉండడానికి రీజన్ ఏమిటి" అని స్మార్ట్ గా అడిగేసరికి "మీ ప్రేమ" అని నవ్వుతూ చెప్పేసింది. "డబ్బు ఇంపార్టెంట్ ఆర్ ఫామిలీ" అని అడగడంతో "ఫామిలీ ఇంపార్టెంట్..వాళ్ళను మంచిగా చూసుకోవడానికి డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్" అని చెప్పింది రీతూ చౌదరి. యంగ్ బ్యూటీగా ఇప్పుడిప్పుడే పాపులర్ రీతూ ఈమధ్య కాలంలో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని, అప్పుడప్పుడు చీరలు కట్టుకుని ఫోటో షూట్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తోంది.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.