Read more!

English | Telugu

వెన్నులో వణుకుపుట్టించిన రిషి మాటలు.. దేవయాని, శైలేంద్రలకి టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -887 లో.. దేవయాని శైలేంద్ర ఇద్దరు జగతిపై చేసిన కుట్ర గురించి మాట్లాడుకుంటారు. ఇక నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. జగతిని మనమే చంపేశామని ఎట్టి పరిస్థితుల్లో రిషికి తెలియకుడదు. మన గురించి మొత్తం తెలిసిన జగతి లేదు కానీ మనం చేసే కుట్రల గురించి తెలిసిన వసుధార ఎప్పుడు రిషి పక్కనే ఉంటుందని శైలేంద్రతో దేవయాని అంటుంది.

ఆ తర్వాత అవును జాగ్రత్తగా ఉండాలి. వసుధారని కూడా అడ్డు తొలగించాలని శైలేంద్ర అనగానే.. ఎవరిని అడ్డు తొలగిస్తారంటూ వసుధార వస్తుంది. జగతి మేడమ్ ఇంటికి వచ్చాక ఏం కాదు. ఇక బతుకుతుందని అనుకున్నాను. మీరే ఏదో చేసారని అనుమానంగా ఉంది కానీ జగతి మేడమ్ చావుకి మీరే కారణమని తెలిస్తే మాత్రం రిషి సర్ మిమ్మల్ని వదిలిపెట్టడు. రిషి సర్ పై నిందని తొలగించి మళ్ళీ కాలేజీకి పంపిస్తానని మేడమ్ కి మాటిచ్చాను. అది నెరవేరుస్తానంటూ దేవయాని శైలేంద్ర ఇద్దరికి వసుధార మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత కాసేపటికి రిషి వచ్చి.. ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. ఇంటి గురించి అని  దేవయాని, కాలేజీ గురించి అంటూ శైలేంద్ర కన్ఫ్యూషన్ అవుతుంటే.. నువ్వు చెప్పు వసుధార అని రిషి అడుగుతాడు. జగతి మేడమ్ గురించి అని వసుధార చెప్తుంది. కాసేపటికి శైలేంద్ర, దేవయాని వెళ్తారు. ఇద్దరు వెళ్లిపోయాక.. జగతిని  రిషి గుర్తుచేసుకొని బాధపడుతుంటే వసుధార దైర్యం చెప్తుంది.

మరుసటి రోజు ఉదయం అందరు హాల్లో కూర్చొని ఉంటారు. మహేంద్రని పిలువమని ధరణితో ఫణింద్ర చెప్తాడు. వద్దు, డాడ్ ని ఒంటరిగా వదిలెయ్యండని రిషి అంటాడు. ఆ తర్వాత జగతిని గుర్తుకుచేసుకుంటు రిషి ఎమోషనల్ అవుతాడు. మా అమ్మ మనతో లేకుండా చేసిన వారెవరో నాకు తెలియాలి. నన్ను చంపాలని అనుకున్న వారు ఎవరు? నా ప్రాణలకి తన ప్రాణాలు అడ్డు పెట్టింది నా తల్లి అని రిషి ఎమోషనల్ అవుతాడు.

అమ్మకి కొడుకుగా మాట ఇస్తున్న నిన్ను మాకు కాకుండా చేసినవారిని వదిలిపెట్టను. నీకు మాట ఇస్తున్నాను. ఇప్పుడు నాకు రెండు బాధ్యతలు ఒకటి మా డాడ్ ని చూసుకోవడం, ఇంకొకటి మా అమ్మని మాకు కాకుండ చేసిన వారిని పట్టుకోవడమని రిషి అంటుంటే.. దేవయాని, శైలేంద్ర లకి టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.