English | Telugu

రిషి సెమినార్ కి ఫిదా అయిన జగతి, మహేంద్ర.‌. వాళ్ళిద్దరిని సత్కరించిన పాండియన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -814 లో.. సెమినార్ హాల్లో అందరూ రిషి గురించి చూస్తుంటారు. రిషి రాలేదు విశ్వం.. తన ఛాంబర్ కి వెళ్లినట్లున్నాడు. నేను వెళ్లి తీసుకొస్తానంటూ ఏంజిల్ వెళ్తుంది. ప్రిన్సిపల్ సర్ వసుధార దగ్గరికి వచ్చి.. నేను రిషి సర్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యట్లేదు.. మీరు చెయ్యండని చెప్పి వెళ్తాడు.

ఆ తర్వాత ఫోన్ పట్టుకొని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర, జగతి ఇద్దరు రిషి కోసం చూస్తుంటారు. "ఎందుకు సర్ ఆలా చూస్తున్నారు. ఇప్పుడు నేను రిషి సర్ కి ఫోన్ చేసాను. రిషి సర్ రారు. మీరెందుకు వచ్చారు సర్. రిషి సర్ ప్రశాంతంగా ఉంటే తనని వచ్చి డిస్టబ్ చేశారు. రిషి సర్ ని నమ్ముకొని ప్రిన్సిపల్ సర్ ఇంత పెద్ద సెమినార్ కండక్ట్ చేస్తే మీరు వచ్చి ఇలా చేసారు. ఇప్పుడు రిషి సర్ వచ్చి సెమినార్ ఇవ్వరు" అని వసుధార అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ వసుధారా మేం ఏమైనా కావాలని వచ్చామా ఇన్వైట్ చేస్తే వచ్చామని మహేంద్ర అంటాడు. అప్పుడే వసుధార అని జగతి ఏదో చెప్తుండగా.. మేడం మీతో మాట్లాడడం లేదు. నేను మహేంద్ర సర్ తో మాట్లాడుతున్నాను అంటూ వసుధార కోపంగా మాట్లాడుతుంది.

నా కొడుకు ని తీసుకొని వస్తాను. వాడు పంతాలు, కోపాల కంటే బాధ్యతలకే ఎక్కువ విలువ ఇస్తాడు. వెళ్లి తీసుకొస్తానని మహేంద్ర వెళ్తుండగా.. అటువైపు నుండి రిషి ఎదురుగా వస్తాడు. అలా వచ్చిన రిషిని మహేంద్ర హగ్ చేసుకుంటాడు. పక్కనే ఉన్న విశ్వనాథ్ చూసి.. మీ మధ్య ఇంత అనుబంధం ఉందా అని అనగానే.. అవును ఈ సర్ నాకు ఆత్మీయులని రిషి చెప్తాడు. సెమినార్ నేను చెప్పలేను. పేపర్ పై రాసి ఇస్తాను. నాకు ఇప్పుడు మాట్లాడాలని లేదని రిషి అంటాడు. లేదు సెమినార్ చెప్పాలని జగతి ఇంకా స్టూడెంట్స్ పట్టుపట్టడంతో రిషి సెమినార్ మొదలు పెడతాడు. "పవర్ అఫ్ స్టడీస్ " అనే కాన్సెప్ట్ పై స్టూడెంట్స్ కి మోటివేషన్ లా రిషి మాట్లాడుతాడు. రిషి మాటలకి బాగుందంటూ స్టూడెంట్స్ క్లాప్స్ కొడుతారు. జగతి, మహేంద్ర రిషి మాటలకూ గర్వపడతారు. మరొక వైపు శైలేంద్ర చాటుగా రిషి చెప్తున్న సెమినార్ చూస్తుంటాడు.

ఆ తర్వాత సెమినార్ పూర్తి అయ్యాక.. పాండియన్ వెళ్లి రిషి సర్ , వసుధార మేడం వీళ్ళిద్దరి వల్లే మాలో మార్పు వచ్చింది. అందుకు మేము వాళ్లిద్దరిని సత్కారించాలనుకుంటున్నాని పాండియన్ అంటాడు. అందుకు ప్రిన్సిపల్ సార్ ఒప్పుకొని.. జగతి, మహేంద్రల చేతుల మీదుగా రిషి, వసుధారలను సత్కరిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.