Read more!

English | Telugu

రిషి సెమినార్ కి ఫిదా అయిన జగతి, మహేంద్ర.‌. వాళ్ళిద్దరిని సత్కరించిన పాండియన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -814 లో.. సెమినార్ హాల్లో అందరూ రిషి గురించి చూస్తుంటారు. రిషి రాలేదు విశ్వం.. తన ఛాంబర్ కి వెళ్లినట్లున్నాడు. నేను వెళ్లి తీసుకొస్తానంటూ ఏంజిల్ వెళ్తుంది. ప్రిన్సిపల్ సర్ వసుధార దగ్గరికి వచ్చి.. నేను రిషి సర్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యట్లేదు.. మీరు చెయ్యండని చెప్పి వెళ్తాడు. 

ఆ తర్వాత ఫోన్ పట్టుకొని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర, జగతి ఇద్దరు రిషి కోసం చూస్తుంటారు. "ఎందుకు సర్ ఆలా చూస్తున్నారు. ఇప్పుడు నేను రిషి సర్ కి ఫోన్ చేసాను. రిషి సర్ రారు. మీరెందుకు వచ్చారు సర్. రిషి సర్ ప్రశాంతంగా ఉంటే తనని వచ్చి డిస్టబ్ చేశారు. రిషి సర్ ని నమ్ముకొని ప్రిన్సిపల్ సర్ ఇంత పెద్ద సెమినార్ కండక్ట్ చేస్తే మీరు వచ్చి ఇలా చేసారు. ఇప్పుడు రిషి సర్ వచ్చి సెమినార్ ఇవ్వరు" అని వసుధార అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ వసుధారా మేం ఏమైనా కావాలని వచ్చామా ఇన్వైట్ చేస్తే వచ్చామని మహేంద్ర అంటాడు. అప్పుడే వసుధార అని జగతి ఏదో చెప్తుండగా.. మేడం మీతో మాట్లాడడం లేదు. నేను మహేంద్ర సర్ తో మాట్లాడుతున్నాను అంటూ వసుధార కోపంగా మాట్లాడుతుంది.

నా కొడుకు ని తీసుకొని వస్తాను. వాడు పంతాలు, కోపాల కంటే బాధ్యతలకే ఎక్కువ విలువ ఇస్తాడు. వెళ్లి తీసుకొస్తానని మహేంద్ర వెళ్తుండగా.. అటువైపు నుండి రిషి ఎదురుగా వస్తాడు. అలా వచ్చిన రిషిని మహేంద్ర హగ్ చేసుకుంటాడు. పక్కనే ఉన్న విశ్వనాథ్ చూసి.. మీ మధ్య ఇంత అనుబంధం ఉందా అని అనగానే.. అవును ఈ సర్ నాకు ఆత్మీయులని రిషి చెప్తాడు. సెమినార్ నేను చెప్పలేను. పేపర్ పై రాసి ఇస్తాను. నాకు ఇప్పుడు మాట్లాడాలని లేదని రిషి అంటాడు. లేదు సెమినార్ చెప్పాలని జగతి ఇంకా స్టూడెంట్స్ పట్టుపట్టడంతో రిషి సెమినార్ మొదలు పెడతాడు. "పవర్ అఫ్ స్టడీస్ " అనే కాన్సెప్ట్ పై స్టూడెంట్స్ కి మోటివేషన్ లా రిషి మాట్లాడుతాడు. రిషి మాటలకి బాగుందంటూ స్టూడెంట్స్ క్లాప్స్ కొడుతారు. జగతి, మహేంద్ర రిషి మాటలకూ గర్వపడతారు. మరొక వైపు శైలేంద్ర చాటుగా రిషి చెప్తున్న సెమినార్ చూస్తుంటాడు.

ఆ తర్వాత సెమినార్ పూర్తి అయ్యాక.. పాండియన్ వెళ్లి రిషి సర్ , వసుధార మేడం వీళ్ళిద్దరి వల్లే మాలో మార్పు వచ్చింది. అందుకు మేము వాళ్లిద్దరిని సత్కారించాలనుకుంటున్నాని పాండియన్ అంటాడు. అందుకు ప్రిన్సిపల్ సార్ ఒప్పుకొని.. జగతి, మహేంద్రల చేతుల మీదుగా రిషి, వసుధారలను సత్కరిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.