English | Telugu

ప్రియాంక జైన్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. షాక్ లో హౌస్ మేట్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే ఉల్టా పుల్టా ట్విస్ట్ లతో ప్రేక్షకులకు కిక్కు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి, వీకెండ్ లో శోభాశెట్టిని ఎలిమినేషన్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో‌ భాగంగా ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న ప్రియంకని బయటకు పంపిస్తారనే వార్త తెగ వైరల్ అవుతుంది.

యావర్, ప్రశాంత్, శివాజీ.. ఈ ముగ్గురిలోనే ఒకరు విన్నర్ అవుతారనేది అందరికి తెలిసిన విషయం. అయితే ఆ ఒక్కరూ ఎవరనేది చివరి వరకూ సస్పెన్సే. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం.. శివాజీ, ప్రశాంత్‌ లకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అఫీషియల్ ఓట్లలో శివాజీ నెంబర్ వన్ స్థానంలో ఉంటు దుమ్మురేపుతున్నాడు. టైటిల్ విన్నర్ శివాజీ అంటూ ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే చాలాసార్లు బిగ్ బాస్‌ శోభాని సపోర్ట్ చేస్తూ.. ఇతర కంటెస్టెంట్స్ ని ఎలిమినేషన్ చేయడంతో, ఈ సారి ఎవర్ని సపోర్ట్ చేస్తారో తెలియదు. తన దత్తపుత్రిక శోభాశెట్టి కోసం ఎవర్ని బలి చేస్తారనేది మాత్రం అంచనా వేయలేం.

కాబట్టి.. ఈవారం ఓటింగ్‌లో అమర్, ప్రశాంత్, శివాజీలకు టఫ్ ఫైట్ ఉంటుంది. ఈ ముగ్గురికీ పోటా పోటీగా ఓట్లు పడుతున్నాయి. అయితే ప్రియాంక, శోభాశెట్టిలు రేస్‌లో ఉన్నా.. వాళ్లకి విన్నర్ అయ్యే అవకాశం లేకపోవడంతో.. వాళ్లకి ఓట్లు వేసి తమ ఓటుని వేస్ట్ చేసుకోకుండా యావర్ కి ఓట్లు వేస్తున్నారు. చాలామంది సీరియల్ ఫ్యాన్స్ అంబటి అర్జున్ కి ఓటేస్తున్నారు. అయితే అమర్ దీప్ ఓటింగ్ శాతం రోజు రోజుకి పడిపోతుంది. నిన్న నాల్గవ స్థానంలో ఉన్న అమర్ ఈరోజు అయిదవ స్థానంలో ఉన్నాడు. ఇక ఓటర్ల మైండ్ సెట్‌ని మార్చడంలో భాగంగా అమర్ దీప్ సెట్ చేసుకున్న పీఆర్ టీమ్ లు అతనే టాప్-3 అనే అపోహని ప్రేక్షకుల మీద రుద్దడానికి తెగ ట్రై చేస్తున్నారు. అయితే ఈ వీకెండ్ శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి, మిడ్ వీక్ లో ప్రియాంకని ఎలిమినేషన్ చేస్తారనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అతి తక్కువ ఓట్లతో లీస్ట్ లో ఉన్న ప్రియాంక, శోభాశెట్టిలని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తాడా లేదా తెలియాలంటే కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.