Read more!

English | Telugu

పల్లవి ప్రశాంత్ పెట్టాడు.. రతిక ఓడిపోయింది!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ప్రేక్షకులని ఎంగేజింగ్ చేస్తుంది. నిన్నటి దాకా నామినేషన్ల వార్ కొనసాగిన విషయం తెలిసిందే. బుధవారం నాటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ని మొదలుపెట్టాడు బిగ్ బాస్. 

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ విభిన్నంగా సాగింది. హౌస్ లోని కంటెస్టెంట్స్ యొక్క ఇండివిడ్యువల్ స్ట్రెంత్ ని డిసైడ్ చేస్తూ సరికొత్త టాస్క్ లని ఇస్తున్నాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ సింక్(మునుగుతుంది) అండ్ ఫ్లోట్(తేలుతుంది). ఈ టాస్క్ లో పాల్గొనేందుకు ఏ నలుగురు వస్తున్నారో హౌస్ మేట్స్ ని డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పగా.. మొదటి టాస్క్ లో అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి , టేస్టీ తేజ ఆడతామని చెప్పారు. ఈ టాస్క్ కి సంచాలకుడిగా గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ఆ తర్వాత ప్రియాంక పదకొండు పాయింట్లతో విజేతగా నిలిచింది. ఇక అమర్ దీప్ అండ్ టేస్టీ తేజకి టై అవడంతో, లాస్ట్ టై బ్రేకర్ లో టేస్టీ తేజ గెలిచి, అమర్ దీప్ ఓడిపోయాడు. దాంతో మొదటి కంటెండర్ టాస్క్ లో అమర్ దీప్ ఓడిపోయాడు.

ఇక రెండవ కంటెండర్ టాస్క్ లో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతిక, గౌతమ్ కృష్ణ పాల్గొనగా.. ఇందులో పల్లవి ప్రశాంత్ చాలా ఫాస్ట్ గా ఆడి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత రెండవ స్థానంలో యావర్, మూడవ స్థానంలో గౌతమ్ ఉన్నాడు. ఇక చివరి స్థానంలో నిలిచిన రతిక ఈ టాస్క్ లో ఓడిపోయింది.