English | Telugu

పదమూడు వేల ఓట్లతో మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్, రెండవ స్థానంలో శోభా శెట్టి!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఇందులో ఒక్కో‌ కంటెస్టెంట్ ఒక్కో గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. ఇప్పటికే టేస్టీ తేజ తన గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తుండగా శివాజీ మరో బాలాదిత్యలా అనిపిస్తుంది. అయితే ఇప్పటికే నామినేషన్లు పూర్తవ్వగా ఓటింగ్ నిన్న రాత్రి నుండి మొదలైంది. దీన్నో అనుకున్నదే జరిగింది. పల్లవి ప్రశాంత్ కి విశేషమైన మద్దతు లభిస్తుంది. తన తప్పేం లేకున్నా నామినేట్ చేసారని, కార్నర్ చేశారని ప్రతీ బిగ్ బాస్ ప్రేక్షకుడికి తెలుసు అందుకే ఒక్క రోజే ఏకంగా పదమూడు వేల ఓట్లు పల్లవి ప్రశాంత్ కి వచ్చాయి. రెండవ స్థానంలో శోభా శెట్టికి రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. రతిక మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక యాక్టర్, డైరెక్టర్ గౌతమ్ కృష్ణ నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు.

హౌజ్ లో ఎక్కువ కమ్యూనికేషన్ లేకుండా ఉండేవారిలో కిరణ్ రాథోర్ ముందు ఉంటుంది. ఎందుకంటే తనకి తెలుగు సరిగ్గా రాదు, అర్థం కాదు. అందుకే తను ఓటింగ్ లిస్ట్ లో చివరన ఉంది. ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గరగా ఉంది కిరణ్ రాథోడే అని వినిపిస్తుంది. కాగా షకీల గారు కంటెస్టెంట్స్ తో ఇప్పుడిప్పుడే కలుస్తున్నారు. సింగర్ దామిణి అందరితో అంత ఈజీగా కలిసిపోలేకపోవడంతో చివర నుండి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇలాగే ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటే సింగర్ దామిణి కూడా ఎలిమినేషన్ తప్పదు. అలాగే ప్రిన్స్ యావర్.. హిందీ, ఇంగ్లీష్ తప్ప తెలుగు అంతగా రానీ మేల్ కంటెస్టెంట్. అయితే బిగ్ బాస్ గ్రాంఢ్ రిలీజ్ రోజే.. తెలుగు రోజుకొక వర్డ్ నేర్చుకోమని ప్రిన్స్ యావర్ కి నాగార్జున చెప్పాడు‌.

ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న అందరిలో అమర్ దీప్, ప్రియాంక సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక శోభా శెట్టి కార్తీక దీపంలో‌ నటించినట్టే ఇందులో కూడా నటిస్తుందని తెలుస్తుంది. ప్రతీ దానికి ఏడుస్తూ సింపతీని కోరుకుంటుంది. మరి తన ఏడుపు ఎంతవరకు వర్క వుట్ అవుతుందో తెలియదు. అయితే ఇప్పటివరకు నామినేషన్లో ఉన్నావారికి జరిగిన ఓటింగ్ లో మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్, రెండవ స్థానంలో శోభా శెట్టి కొనసాగుతున్నారు. కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చివరలో ఉన్న దామిణి, కిరణ్ రాథోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి!

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.