English | Telugu

అనామిక గదిలో కళ్యాణ్ కవితలు.. కావ్య టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -194 లో.. కావ్య ఇంటి ముందు ముగ్గు వేస్తు ఉంటుంది. రాజ్ ఫోన్ మాట్లాడుతూ చూడకుండా ముగ్గుని తొక్కుతాడు. కావ్య గట్టిగా అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తూన్నావ్? నువ్వు వేసే తొక్కలో ముగ్గంటూ కావ్యని రాజ్ అంటాడు. అప్పుడే అటుగా వస్తున్న సీతరామయ్యని చూసి నీ ముగ్గు బాగుంది కావ్య అంటూ మెచ్చుకుంటాడు. అది చూసి సీతరామయ్య సంతోషపడతాడు.

ఆ తర్వాత ముగ్గు అంటే ఇలా వేయాలి. మా అమ్మ వేస్తుంది, ఏం బాగా వెయ్యదని రాజ్ అంటాడు. ఆ మాట అపర్ణ రుద్రాణి వింటుంది. ఆ తర్వాత ఈ కావ్యని పొగడాలంటే మా అమ్మని తక్కువ చేసి మాట్లాడాలా అని తనను తాను తిట్టుకుంటాడు రాజ్. ఆ తర్వాత రుద్రాణి.. చూసావా వదిన పెళ్ళాం బెల్లంణ తల్లి అల్లం. ఏంటి ఈ గొళ్ళెమంటూ అపర్ణతో వెటకారంగా అంటుంది. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు కలిసి బయటకు వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి కార్ తో వచ్చి కళ్యాణ్ , అప్పు లు వెళ్తున్న బైక్ కి తాకిస్తుంది. ఆ తర్వాత అప్పు కోపంగా వెళ్లి ఆ అమ్మయిని తిడుతుంది. తీరా చూస్తే కార్ లో ఉన్న అమ్మయి అనామిక. తనని చూసిన కళ్యాణ్.. తిట్టకు అప్పు, తను అనామిక అని అప్పుకి పరిచయం చేస్తాడు. నిన్ను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తానని కళ్యాణ్ కి అనామిక చెప్తుంది. సరే అని అప్పుని వదిలేసి అనామికతో కలిసి వెళ్తాడు కళ్యాణ్. మరొక వైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తు టిఫిన్ కోసం కావ్యని పిలుస్తాడు. ఇంకా రెడీ కాలేదని కావ్య చెప్తుంది. నువ్వు వెళ్ళు రాజ్, కావ్య ఆఫీస్ కి టిఫిన్ తీసుకొని వస్తుందని సీతరామయ్య చెప్తాడు.. సరే అని రాజ్ అంటాడు. అలా కావ్య పై రాజ్ పాజిటివ్ గా ఉండడం చూసిన అపర్ణకి కోపం వస్తుంది. మరొక వైపు కళ్యాణ్ ని అనామిక తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంట్లో వాళ్లకి కళ్యాణ్ ని పరిచయం చేసి తన గదిని చూపిస్తుంది. తన గదిలో కళ్యాణ్ రాసిన కవితలు గోడకి ఫ్రేమ్ తో ఉండడం చూసిన కళ్యాణ్ .. నేను రాసిన కవితలంటే ఇంత ఇష్టమా అని అనుకుంటాడు. ఆ తర్వాత అనామిక కళ్యాణ్ ఫోటోని తనకి కన్పించకుండా జాగ్రత్తపడుతుంది.

మరొక వైపు అందరూ హాల్లో కూర్చొని ఉండగా.. రాహుల్ స్వప్న ఇద్దరు ఎక్కడ కన్పించడం లేదని రుద్రాణిని ఇందిరాదేవి అడుగుతుంది. వాళ్ళు హనీమూన్ అని పది రోజులు ఎక్కడికో వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో తెలియదని రుద్రాణి అనగానే.. అంత నిర్లక్ష్యం ఎందుకు? వెంటనే కాల్ చేసి వెనక్కి రమ్మని చెప్పమని ఇందిరాదేవి అనగానే రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేస్తే ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఆ తర్వాత స్వప్న రాహుల్ ఎక్కడికి వెళ్లారని కావ్య టెన్షన్ పడుతుంటే.. ధాన్యలక్ష్మి వచ్చి నువ్వు టెన్షన్ పడకు‌. వాళ్ళ గురించి అలోచించకు. ముందు నువ్వు రాజ్ కి క్యారేజ్ తీసుకొని వెళ్ళు అనగానే కావ్య సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.