English | Telugu

అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ లలో ఎవరు కరెక్ట్?

బిగ్ బాస్ సీజన్-7 మొదలైన రెండవ వారంలోనే.. కామన్ మ్యాన్ , సెలబ్రిటీ ల మధ్య జరిగిన గొడవ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. మళ్ళీ పద్నాలుగు వారాల తర్వాత రిపీట్ అయింది. ఇప్పటికి హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా పద్నాలుగవ వారం కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగింది. ఈ వారం ఓట్ అప్పీల్ కోసం హౌస్ లో‌ టాస్క్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా మొన్నటి టాస్క్ లో యావర్,‌ శోభాశెట్టి ఉండగా.. కన్నింగ్ అర్జున్ వేసిన ఒక్క నమ్మకద్రోహం పనివల్ల శోభాశెట్టి అధిక మద్దతు పొంది ఓట్ అప్పీల్ కి అర్హత సాధించింది. ఆ తర్వాత జరిగిన టాస్క్ లలో అంబటి అర్జున్, అమర్ దీప్ గెలవడం వల్ల వారిద్దరు ఓట్ అప్పీల్ కి అర్హత సాధించగా.. హౌస్ మేట్స్ అభిప్రాయంతో అంబటి అర్జున్ ఓట్ అప్పీల్ కి అర్హత సాధించాడు.

ఇక ఆ తర్వాత జరిగిన టాస్క్ కాస్త అమర్ దీప్, ప్రశాంత్ ల మధ్య పెద్ద గొడవకి దారితీసింది. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ఒక జాకెట్ వేసుకోవాలి. మిగిలిన వాళ్ళు వారిపైకి బాల్స్ విసిరేస్తుంటారు. ఎవరి జాకెట్ కి ఎక్కువ బాల్స్ అతుక్కుంటావో వాళ్ళు అవుట్ అని బిగ్ బాస్ చెప్పాడు. మొదట యావర్ ని రెచ్చగొట్టి తనని లైన్ నుండి బయటకు వచ్చేలా చేసింది శోభాశెట్టి. ‌ఆ తర్వాత యావర్ మరింత రెచ్చిపోయాడు. అయితే ఇందులో శోభాశెట్టి కావాలని చేసిందని తనే ఒప్పుకుంది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని అమర్ దీప్ టార్గెట్ చేసి బాల్స్ వేశాడు. ఇక దగ్గరికి వెళ్ళి ప్రశాంత్ ని పట్టుకొని ఫిజికల్ అయ్యాడు అమర్ దీప్. ఇందులో పల్లవి ప్రశాంత్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. అమర్ దీప్ కావాలని తనని గోళ్ళతో గీకాడని ప్రశాంత్ అనగా.. నన్ను రెచ్చగొట్టకు రా ప్రశాంత్ అని అమర్‌దీప్ అన్నాడు‌.‌ ఇక " నన్ను రా అని అనొద్దు" అన్న అని ప్రశాంత్ అనగా.. నన్ను నెగెటివ్ చేయాలని చూస్తున్నావ్? చేయు రా అంటు ఓవర్ అగ్రెసివ్ అయ్యాడు అమర్ దీప్. ఇక ఈ ఆర్గుమెంట్ లో పల్లవి ప్రశాంత్ ని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం చాలా పెద్ద తప్పు.. వీకెండ్ లో‌ నాగార్జున దీనిపై గట్టిగా క్లాస్ పీకే ఛాన్స్ ఉంది.‌ అయితే‌ ఇప్పుడు సోషల్ మీడియాలో అమర్ దీప్, ప్రశాంత్ లలో ఎవరు కరెక్ట్ అనే క్వశ్చన్ ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.