English | Telugu

ప్రామిసింగ్‌గా క‌నిపిస్తోన్న కొత్త సీరియ‌ల్ 'నేత్ర‌'

నేత్ర అనే కొత్త సీరియల్ జెమినీ టీవీలో త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నరుడికి, నాగినికి మధ్య ప్రేమ గెలిస్తేనే రాక్షస సంహారం జరుగుతుంది ..నాగమణి సొంతమవుతుంది" అనే కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతోంది. ప్రేమ కోసం పగతో నాగిని యుద్ధం చేయబోతోంది. ఇందులో హీరోగా మలయాళ నటుడు ప్రేమ్ జాకబ్ నటిస్తున్నాడు.

బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించిన శివాని తోమర్ ఈ సీరియల్ లో యాక్ట్ చేస్తోంది. ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించిన భరద్వాజ్ కూడా ఈ సీరియల్ లో నటిస్తున్నాడు.అత‌ను 'మొగలి రేకులు' సీరియల్ లో ఒక చిన్న నెగటివ్ రోల్ లో నటించాడు. గతంలో 'ప్రతిఘటన', 'ఆడదే ఆధారం' సీరియల్స్ లో నటించాడు.

శ్రీమతి శ్రీనివాస్, అభిషేకం, పద్మవ్యూహం, కార్తీక దీపం వంటి సీరియల్స్ లో నటించిన జ్యోతి రెడ్డి ఈ సీరియల్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు. అంజు అస్రాని, ఒకప్పుడు సినిమాల్లో నటించి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్న చిన్నా, సీనియర్ యాక్టర్ కృష్ణవేణి, ప్రియాంక, 'మట్టిగాజులు', 'మనసు మమత'సీరియల్స్ లో నటించిన చక్రి, రాధాకృష్ణ, దుర్గాదేవి, శ్రావణి యాదవ్ వంటి వారు కూడా కనిపించబోతున్నారు.

అత్తారింటికి దారేది, అల వెంకటాపురం సీరియల్స్ లో నటించిన ప్రియా తరుణ్ కూడా ఈ సీరియల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ జెమినీ టీవిలో ఈ నెలలో ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి డేట్, టైం స్లాట్ త్వరలో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.