Read more!

English | Telugu

యావర్‌తో డేటింగ్.. పల్లవి ప్రశాంత్‌తో పెళ్లి

బిగ్ బాస్ సీజన్-7 లో గ్రాంఢ్ లాంచ్ 2.0 కోసం ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్న విషయమ తెలిసిందే. ఇక ఆ సమయం రానే వచ్చింది. హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఈ సీజన్-7 మరింత రసవత్తరంగా మారనుంది.

గ్రాంఢ్ లాంచ్ 2.0 లో అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో మొదటగా అంబటి అర్జున్ ఎంట్రీ ఇవ్వగా, రెండవ కంటెస్టెంట్ గా అశ్విని శ్రీ, మూడవ కంటెస్టెంట్ గా భోలే శావలి, నాల్గవ కంటెస్టెంట్ గా పూజా మూర్తి, అయిదవ కంటెస్టెంట్ గా నయని పావని ఎంట్రీ ఇచ్చింది. అయితే నయని పావని స్ఢేజ్ మీదకి రాగానే ఒక టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఒక బోర్డ్ మీద ముగ్గురు ఫోటోలని ఉంచి, ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తావ్? ఎవరితో డేటింగ్ కి వెళ్తావ్? ఎవరిని పెళ్ళి చేసుకుంటావని నాగార్జున అడుగగా.. కాసేపు ఆలోచించిన నయని పావని టేస్టీ తేజతో ఫ్రెండ్ షిప్ చేస్తానని చెప్పింది.

ఆ తర్వాత ప్రిన్స్ యావర్ తో డేటింగ్ కి వెళ్తానని అంది. ఎందుకని నాగార్జున అనగా.. హాట్ గా ఉంటాడు సర్ అని అంది నయని. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని పెళ్ళి చేసుకుంటానని చెప్పింది నయని. నయని పావని టిక్ టాక్ వీడియోలు చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ఇన్ స్టాగ్రామ్ కి వచ్చేసింది ఈ భామ. ఇక ఇన్ స్టాగ్రామ్ రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ, తన హాట్ అండ్ బోల్డ్ ఫోటోలని షేర్ చూస్తూ అత్యధిక ఫాలోయింగ్ ని సంపాదించుకుంది నయని. సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ భామ బిగ్ బాస్ హౌజ్ లో ఎలా ఉంటుందో చూడాలి మరి.