English | Telugu

రవితేజ వాళ్ళ అమ్మకు ముకేశ్ గౌడ అంటే చాలా ఇష్టం...

గుప్పెడంత మనసు సీరియల్ కి ఆమె బిగ్ ఫ్యాన్ కూడా నెక్స్ట్ ఇయర్ ముకేశ్ రెండు సినిమాలు రిలీజ్ గుప్పెడంత మనసు సీరియల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచి టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్లి చివరికి ఎండ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఇక ఇందులో హీరో ముకేశ్ గౌడా నటన కానీ అతని ఆటిట్యూడ్ కానీ చాలా కూల్ ఉంటుంది అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటాడు.. దాంతో లేడీ ఫాన్స్ అంతా ఆయన నటనకు ఫిదా ఇపోయారు. ఇక ముకేశ్ గౌడ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు. తెలుగు ఆడియన్స్ కి ఒక వ్యక్తి నచ్చితే గనక వాళ్ళ ఇంట్లో అబ్బాయికంటే ఎక్కువగా ఆదరిస్తారు అన్నాడు. అలా తెలుగు వాళ్ళ అభిమానాన్ని పొందడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. ఇక ముకేశ్ గౌడ నటించిన గీత శంకరం, ప్రియమైన నాన్నకు మూవీస్ రెండు కూడా 2025 లో రిలీజ్ అవుతాయని చెప్పాడు.

ఇక టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ వాళ్లకు "గుప్పెడంత మనసు" సీరియల్ అంటే చాలా ఇష్టమని రవితేజ వాళ్ళ అసిస్టెంట్ ఒక సారి కాల్ చేసి వాళ్ళ అమ్మగారితో మాట్లాడించారని చెప్పాడు ముఖేష్ గౌడా. అలాగే ముకేశ్ గౌడ అంటే బ్రహ్మానందంకి కూడా ఎంతో ఇష్టం. గుప్పెడంత మనసు సీరియల్ కి కూడా ఆయన ఎంతో బిగ్ ఫ్యాన్ కూడా. ఆయన ఈ సీరియల్ షూటింగ్ సెట్ కి వచ్చి ముకేశ్ తో కలిసి ఫొటోస్ కూడా దిగారు. ఐతే బిగ్ బాస్ వెళ్లే ఛాన్స్ లేదని చెప్పేసాడు. ఐతే మా టీవీ కొలాబరేషన్ లో పని చేసే అవకాశం రావొచ్చు అని చెప్పాడు. వెబ్ సిరీస్ లో కానీ ఇంకా ఎందులో ఐనా కానీ కనిపించే అవకాశం ఉందని కూడా చెప్పాడు. అలాగే ఆడియన్స్ కి కూడా ఒక మాట చెప్పాడు. తనను ఇప్పటి వరకు సొంత కొడుకులా చూసుకున్నారు...రాబోయే రోజుల్లో కూడా తనకు ఇలాగే ప్రేమ, సపోర్ట్ కావాలని కోరుకున్నాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.