English | Telugu

'కళ్యాణ వైభోగం' కహానీ: దివ్య మరణం తథ్యమా?

దివ్య మరణం తథ్యమా? శాపం ఆమె ప్రాణాలను బలి తీసుకుంటుందా? చెల్లి ప్రాణం కాపాడటం కోసం అభి ఏం చేస్తాడు? ఏం చేయబోతున్నాడు? 'కళ్యాణ వైభోగం' సీరియల్ లో మంగళవారంనాటి ఎపిసోడ్ ముగింపు ప్రేక్షకులను మునివేళ్లపై ఉంచిందని చెప్పాలి. ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న సీరియళ్లలో జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమయ్యే 'కళ్యాణ వైభోగం' ఒకటి.

అన్నాచెలెళ్లు అభి, దివ్య సహా వాళ్ళ కుటుంబ పతనమే పరమావధిగా, తన ప్రాణరక్షణే ధ్యేయంగా నిత్యా శ్రీనివాస్ వేసిన పథకం ఫలించింది. దివ్య కుటుంబానికి ఉన్న శాపం ప్రకారం... ఆ ఇంటికి వచ్చే కోడలు మరణిస్తుంది. కానీ, ఈసారి శాపం దివ్యకు కూడా ఉందని పురోహితులు చెబుతారు. అది తెలిసిన చారి పక్షవాతం బారినపడి మంచానికి పరిమితం అవుతాడు. మరోవైపు శాపం గురించి నిత్యా శ్రీనివాస్ చెవిన పడిన సంగతి తెలిసిందే. అదేంటంటే... దివ్య ప్రాణాలతో ఉండాలంటే ఆమెకు పెళ్లి కాకూడదు. పెళ్ళైతే మరణిస్తుంది. ఒకవేళ దివ్యకు పెళ్లి కాకపోతే నిత్యా శ్రీనివాస్ మరణిస్తుంది. ఇది తెలుసుకున్న నిత్యా, అక్క కూతురు మెడలో మూడు ముడులు పడేలా పావులు కదుపుతుంది. చాణక్యకు కోపం వచ్చేలా చేసి, అతడిని దివ్య ఇంటికి పంపిస్తుంది.

ఆవేశంతో దివ్య, అభిల ఇంటికి వెళ్లిన చాణక్య... దివ్య మెడలో తాళి కడతాడు. శాపం గురించి దివ్య, ఇతర కుటుంబ సభ్యులకు తెలియనప్పటికీ... అభికి తెలుసు. తన ముందే చెల్లెలు మెడలో మూడు ముడులు పడటంతో షాక్ తింటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. మరి, తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. సీరియల్ లో మేజర్ ట్విస్ట్ ఇది. ఇప్పుడు దివ్య మరణం తథ్యమా? చెల్లి ప్రాణాలు అభి కాపాడలేడా? అని అందరూ చర్చల్లోకి దిగారు. రాబోయే రోజుల్లో సీరియల్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.