English | Telugu

బిగ్ బాస్ 5 హౌస్‌లోకి ర‌వి వెళ్తున్నాడ‌ని క‌న్ఫామ్ చేసిన లాస్య‌!

బిగ్ బాస్ 5లో వీక్ష‌కుల‌కు తెలిసిన ముఖాల‌ను, సెల‌బ్రిటీల‌ను తీసుకురావ‌డానికి నిర్వాహ‌కులు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సురేఖా వాణి, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్‌, యాంక‌ర్ ర‌వి, టీవీ బ్యూటీ న‌వ్య స్వామి, సినీ తార‌లు ఇషా చావ్లా, పూన‌మ్ బ‌జ్వా, కొరియోగ్రాఫ‌ర్ ఆనీ లాంటి వారు వెళ్ల‌నున్న‌ట్లు ఓ లిస్టు ఆన్‌లైన్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే తాను బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌గా వెళ్ల‌డం లేద‌ని ఇషా చావ్లా స్ప‌ష్టం చేసింది.

కాగా ఈసారి హౌస్‌లోకి యాంక‌ర్ ర‌వి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే, అత‌డు కంటెస్టెంట్‌గా వెళ్తున్న విష‌యాన్ని అత‌డి జంట యాంక‌ర్ లాస్య క‌న్ఫామ్ చేసింది. రీసెంట్‌గా 'క‌న‌బ‌డుట‌లేదు' అనే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ర‌వి, లాస్య యాంక‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు.

మాట‌ల మ‌ధ్య‌లో లాస్య మాట్లాడుతూ, "క‌న‌బ‌డుట‌లేదు టైటిల్ చాలా బాగుంది. కొద్ది రోజుల్లో ర‌వి క‌నిపించ‌కుండా పోతాడేమోన‌ని నా డౌట్" అంది లాస్య‌.
"ఏయ్" అని హెచ్చ‌రించాడు ర‌వి.
"ఏదో హౌస్‌లోకి వెళ్తున్నారు క‌దా.." అంది లాస్య‌.
ఆమెవైపు అలాగే సీరియ‌స్‌గా చూశాడు ర‌వి.. దాంతో లాస్య క‌వ‌ర్ చేసుకుంటూ, "ఐ మీన్‌.. మీ హౌస్‌లోకి వెళ్తున్నావ్ క‌దా" అంది.
"మా ఇంటికెళ్తున్నా" అన్నాడు ర‌వి. లాస్య పెద్ద‌గా న‌వ్వేసింది. అదీ విష‌యం!

నిర్వాహ‌కులు వెల్ల‌డించేదాకా కంటెస్టెంట్లు ఎవ‌రూ తాము బిగ్ హౌస్‌లోకి వెళ్తున్న‌ట్లు బ‌హిర్గ‌తం చేయ‌కూడ‌దు. అందుకే తాను హౌస్‌లోకి వెళ్తున్న విష‌యాన్ని లాస్య క‌న్‌ఫామ్ చేయ‌డంతో క‌ళ్ల‌తోనే ఆమెను ర‌వి హెచ్చ‌రించాడ‌నీ, వెంట‌నే ఆమె దాన్ని క‌వ‌ర్‌చేస్తూ మాట్లాడింద‌నీ తెలుస్తోంది.

నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే 'బిగ్ బాస్' తెలుగు 5వ‌ సీజ‌న్ సెప్టెంబ‌ర్ 5న మొద‌ల‌వుతుంద‌ని వినిపిస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.