English | Telugu

డాక్టర్‌ బాబు అరెస్ట్... జైలుకు తీసుకెళ్లిన పోలీసులు!

'కార్తీక దీపం'లో కీలక మలుపు చోటు చేసుకుంది. కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని జైలుకు తీసుకు వెళ్లారు. అసలు ఏం జరిగింది? అనేది పూర్తిగా తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. అంతలా ప్రోమోలో ట్విస్ట్ షాక్ ఇచ్చింది. ఇవాళ్టి ఎపిసోడ్ ఎండింగ్‌లో మోనితను చంపేస్తానని కార్తీక్ అన్నాడు. కార్తీక్ కాకుండా ఎవరో మోనితను చంపి, ఆ హత్యానేరం కార్తీక్ మీద తోసినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. అసలు, అందులో ఏముంది? అనే అంశంలోకి వెళితే...

కార్తీక్, దీప ఇంట్లో ఉంటారు. వాళ్ళింటికి పోలీసులతో ఏసీపీ రోషిణి వస్తుంది. 'రండి మేడమ్. మేమే మీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాం' అని దీప అంటుంది. 'ఎందుకు? లొంగిపోవడానికా?' అని రోషిణి ప్రశ్నిస్తుంది. 'ఏమైంది?' అని దీప అంటుంది. ఆమెతో కాకుండా కార్తీక్‌తో రోషిణి మాట్లాడటం మొదలు పెడుతుంది. 'మోనిత శవాన్ని ఎక్కడ దాచావ్?' అని ప్రశ్నిస్తుంది. 'శవం ఏంటి?' అని దీప అడుగుతుంది. 'నీ భర్త మోనితను షూట్ చేసి చంపి, శవాన్ని మాయం చేశాడు' అని రోషిణి చెబుతుంది. దీప మాత్రమే కాదు, ఆమె మాటలకు కార్తీక్ కూడా షాక్ అవుతాడు.

మోనితను హత్య చేశాడనే అభియోగం మీద కార్తీక్ ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళతారు. దీపతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కన్నీరు మున్నీరు అవుతారు. కొత్తగా విడుదల చేసిన ప్రోమోతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. మోనిత శవం కనిపించడం లేదని ఏసీపీ రోషిణి చెప్పింది. దీనిబట్టి అసలు మోనిత నిజంగా మరణించిందా? లేదంటే నాటకం ఆడుతుందా? అనే సందేహం కలగక మానదు. మోనిత జైలుకు వెళుతుందని ప్రేక్షకులు అందరూ భావిస్తున్న తరుణంలో కార్తీక్ ను జైలుకు పంపి దర్శకుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.