English | Telugu

ఎపిసోడ్ 1111.. భాగ్యాన్ని కిడ్నాప్‌ చేసిన మోనిత... టెన్షన్‌లో వంటలక్క!

‘కార్తీక దీపం’ సీరియల్‌లో నేటి (ఆగస్టు 06, 2021) ఎపిసోడ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఏం జరిగింది? తర్వాత ఏం జరగబోతోంది? అనేది పక్కన పెడితే... నేటి ఎపిసోడ్‌ సంఖ్య 1111. నంబర్‌లో మొత్తం నాలుగు ఒకట్లు ఉన్నాయి. సక్సెస్‌ఫుల్‌గా వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ డైలీ సీరియల్‌ నేడు వెయ్యినూట్ల పదకొండవ ఎపిసోడ్‌లో ఎంటరైంది. మరో మైలురాయి చేరుకుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే విషయంలోకి వెళితే...

మోనితను కిడ్నాప్‌ చేయడానికి ఆమె ఇంటికి భాగ్యం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, కార్తీక్‌ దగ్గర అంజి ఉన్నాడని అబద్ధం ఆడటంతో మోనిత పసిగట్టేస్తుంది. నిన్న జరిగిందిది. నేడు భాగ్యాన్ని మోనిత కిడ్నాప్‌ చేయడం సీరియల్‌లో కీలక మలుపు.

పిన్ని దగ్గరకు వెళ్తున్నానని డాక్టర్ బాబు అలియాస్‌ కార్తీక్‌కు చెప్పిన వంటలక్క.. అంజి దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఫోన్‌ ఇంట్లో మర్చిపోవడం, వంటలక్క ఫోన్‌కు ఆమె పిన్ని భాగ్యం కాల్‌ చేయడంతో తనతో భార్య అబద్ధం చెప్పిందని డాక్టర్ బాబు పసిగడతాడు. ఇంటికి వచ్చిన దీపను నిలదీయడంతో ఆమె అసలు విషయం చెబుతుంది. అంజిని మోనిత కిడ్నాప్‌ చేసిన వీడియో చూపించి, అడ్రస్‌ చెప్పి మరీ భర్తను అక్కడికి పంపిస్తుంది.

అంజి దగ్గరకు డాక్టర్‌బాబు వెళతాడు. మోనిత మనిషి ద్రాక్షారామం నుండి తప్పించుకునే క్రమంలో డోర్‌ తీయగా... అంజి ముందు డాక్టర్ బాబు ప్రత్యక్షం అవుతాడు. మోనిత తనను కిడ్నాప్‌ చేసిందని డాక్టర్ బాబుతో అంజి చెబుతాడు. ఇంకా మోనిత చేసిన నేరాలను బయటపెడతాడు. ‘నీ మాటలను నేను నమ్మను’ అని డాక్టర్‌బాబు అనేసరికి... ‘నన్ను నమ్మకపోయినా పర్వాలేదు. కానీ, మోనితను మాత్రం నమ్మవద్దు’ అంటాడు. అయితే డాక్టర్‌బాబు అతడి మాటల్ని కొట్టి పారేస్తాడు.

మరోవైపు భాగ్యం కిడ్నాప్‌ అవుతుంది కదా! ఆమె ఫోన్‌కు మురళీకృష్ణ కాల్‌ చేస్తాడు. రిసీవ్‌ చేసుకోకపోవడంతో వంటలక్క దగ్గరకు వస్తాడు. మురళీకృష్ణతో పాటు వంటలక్క కూడా భాగ్యానికి ఏమై ఉంటుందోనని కంగారుపడతారు. ఇవీ ఆగస్టు 06 ఎపిసోడ్‌ హైలైట్స్‌. మరోవైపు కుమారుడు కార్తీక్‌, మోనిత పెళ్లి గురించి ఆనందరావు టెన్షన్‌ పడటం, ఆదిత్య-శ్రావ్య కూల్‌ చేయడం జరిగాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.