English | Telugu

బిగ్ బాస్ 5.. ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు క్రేజీ ఆఫ‌ర్‌!

యూట్యూబ‌ర్‌గా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలోనూ అత‌డి ఫాలోయ‌ర్స్ సంఖ్య త‌క్కువేమీ కాదు. త‌న వీడియోల‌తోనే కాకుండా, ఇత‌ర‌త్రా కూడా ష‌ణ్ముఖ్ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నాడు. యూట్యూబ్‌లో అత‌డు క్రియేట్ చేసే రికార్డుల‌ను, యూత్‌లో అత‌డికున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌ని బిగ్ బాస్ తెలుగు నిర్వాహ‌కులు చాలా కాలంగా ట్రై చేస్తూనే ఉన్నారు. మునుప‌టి సీజ‌న్ల‌కు త‌న‌కు ఆఫ‌ర్ చేసిన రెమ్యూన‌రేష‌న్ అసంతృప్తి క‌లిగించ‌డంతో అత‌ను ఆ షోలో భాగం కావ‌డానికి అంగీక‌రించ‌లేదు.

దాంతో బిగ్ బాస్ 5 సీజ‌న్‌కు అత‌డిని ఎలాగైనా తీసుకురావాల‌ని షో నిర్వాహ‌కులు నిర్ణ‌యం తీసుకున్నారు. దీని కోసం భారీ మొత్తాన్నే అత‌డికి ఆఫ‌ర్ చేశార‌నీ, త‌ను ఊహించిన దానికి మించి ఆఫ‌ర్ రావ‌డంతో ష‌ణ్ముఖ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లూ ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్ బాస్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు అంద‌రికంటే అత‌డికే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ ముడుతున్న‌ట్లు, అది కోటి రూపాయ‌ల దాకా ఉంటుంద‌న్న‌ట్లు చెప్పుకుంటున్నారు.

నాలుగో సీజ‌న్‌లో ఎక్కువ పాపుల‌ర్ ఫేస్‌లు లేవ‌నే విమ‌ర్శ‌లు రావ‌డంతో, ఈసారి వార్త‌ల్లో వ్య‌క్తుల మీద‌నే ఆర్గ‌నైజ‌ర్స్ ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సురేఖా వాణి, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్‌, యాంక‌ర్ ర‌వి, టీవీ బ్యూటీ న‌వ్య స్వామి, సినీ తార‌లు ఇషా చావ్లా, పూన‌మ్ బ‌జ్వా, కొరియోగ్రాఫ‌ర్ ఆనీ లాంటి వారు వెళ్ల‌నున్న‌ట్లు ఓ లిస్టు ఆన్‌లైన్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదే నిజ‌మైతే బిగినింగ్ నుంచే 5వ సీజ‌న్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అంత‌మంది సెల‌బ్రిటీల్లో ష‌ణ్ముఖ్‌కే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ ద‌క్కుతుండ‌టం టాక్ ఆఫ్ ద టౌన్‌. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబ‌ర్ 5న మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.