English | Telugu

సుమిత్ర, దశరథ్ ల పెళ్ళిరోజుని సెలబ్రేట్ చేసిన కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -504 లో... సుమిత్ర, దశరథ్ ఇద్దరు ఇంట్లోకి వస్తారు. సుమిత్ర వచ్చిందంటే కారణం కార్తీక్ అని అందరు పొగుడుతుంటే జ్యోత్స్న కోపంగా పైకి వెళ్తుంది. తనతో పాటు తన వెనకాలే పారిజాతం వెళ్తుంది.

ఏంటే మీ అమ్మ వచ్చింది కనీసం దగ్గరికి కూడ వెళ్ళాలేదని పారిజాతం ఆడుగుతుంది. కనీసం మా మమ్మీ నా మొహం కూడా చూడలేదని జ్యోత్స్న కోప్పడుతుంది. ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని రిక్వెస్ట్ చెయ్.. నువ్వు తప్పు చేసావ్.. ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు.. నువ్వు చేసిన తప్పు మర్చిపోతారని పారిజాతం అంటుంది. జ్యోత్స్నని పారిజాతం కిందకి తీసుకొని వెళ్తుంది.

మరొకవైపు స్వప్న, కావేరి ఇద్దరు సుమిత్ర గురించి టెన్షన్ పడుతుంటే.. స్వప్నకి కార్తీక్ మెసేజ్ చేస్తాడు. సుమిత్ర అత్త ఇంటికి వచ్చింది.. అందరం ఇక్కడే ఉన్నామని.. మీరు రండీ అని కార్తీక్ మెసేజ్ చేస్తాడు. దాంతో స్వప్న హ్యాపీగా ఫీల్ అయి వాళ్ళ అమ్మకి చెప్తుంది. మనం వెళదామని స్వప్న, కాశీ అంటారు. వద్దని కావేరి అంటుంది.

మరొకవైపు పాపం జ్యోత్స్న పైకి వెళ్లి వాళ్ళ అమ్మ గురించి బాధపడుతుంటే తీసుకొని వచ్చానని పారిజాతం కవర్ చేస్తుంది. తనకి కౌంటర్ వేస్తూ కార్తీక్ మాట్లాడతాడు. ఆ తర్వాత సుమిత్ర జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. దీప లేకపోయి ఉంటే నేను ఇలా మీ అందరి ముందు ఉండేదాన్ని కాదని సుమిత్ర అంటుంది.

నేను చెప్పాను కదా మమ్మీ గురించి దీపకి తెలుసని జ్యోత్స్న అంటుంది. ఏది ఏమైనా సుమిత్ర ఇంటికి వచ్చిందంటే అది ఖచ్చితంగా దీప, కార్తీక్ వల్లనే అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ ల పెళ్లి రోజుని కార్తీక్ సెలబ్రేట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.