English | Telugu

Karthika Deepam 2 : కాశీ రాకతో గందరగోళం.. వాళ్ళిద్దరి పెళ్ళిని కార్తీక్ చేయగలడా!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -138 లో....శ్రీధర్ స్వప్నకి పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. దాంతో నన్ను ఇంత మోసం చేస్తావా మమ్మీ అని స్వప్న అనుకుంటుంది. నేనొక సారి అబ్బాయితో మాట్లాడుతనని స్వప్న అనగానే.. శ్రీధర్ సరే అని అబ్బాయిని పంపిస్తాడు. స్వప్న దగ్గరికి ఆ అబ్బాయి వచ్చాక.. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్న అని ఫోటో చూపించిగానే.. అతని పేరు కాశీ.. నాకు తెలుసని అతను అంటాడు. నువ్వు అతన్ని ప్రేమించావు.. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా పదా ముహూర్తం గురించి తెలుసుకుందామని అబ్బాయి అంటాడు. నాకు ఇప్పుడు విషయం అర్థమైంది.. ఇప్పుడు కాశీకి చెప్పి.. మేం నిర్ణయం తీసుకోవాలని స్వప్న అనుకొని.. కాశీకి ఫోన్ చేస్తుంది.. కానీ కలవదు.

ఆ తర్వాత కార్తీక్ కాశీ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే శౌర్య వచ్చి కార్తీక్ తో మాట్లాడుతుంది. అప్పుడే కాశీ కూడా వస్తాడు. నిన్ను ఏమని పిలవాలని కాశీతో శౌర్య అనగానే.. దీపక్క అని పిలుస్తాను. కాబట్టి నువ్వు నన్ను మావయ్య అని పిలవమని కాశీ అంటాడు. ఈ విషయం అందరికి చెప్తానంటూ శౌర్య హ్యాపీగా వెళ్తుంది. కార్తీక్ తో బావ అంటు కాశీ మాట్లాడతాడు. బావ అంటే మీకు ఒకే కదా అని కాశీ అడుగుతాడు. వరుస కూడా అదే అవుతుంది కదా అని కార్తీక్ అంటాడు. మీరు నేను తెలియనప్పుడే హెల్ప్ చేశారు.. ఇప్పుడు నాకు బంధువులు అవుతారు.. మీ పెళ్లిలో అన్ని పనులు నేనే చూసుకుంటా బావ అని కాశీ అంటాడు. మా పెళ్లి బాధ్యత కూడా మొత్తం మీరే చూసుకోవాలని కాశీ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర దాస్ కి కాఫీ తీసుకొని వస్తుంది. మీ మంచితనం మీ కూతురికి రాలేదు వదినా.. మీ గుణం మీ పెంపకంలో లేదని దాస్ సుమిత్రతో జ్యోత్స్న గురించి మాట్లాడతాడు. ఆ మాటలు పారిజాతం వింటుంది. పారిజాతం చాటుగా వినడం శౌర్య చూస్తుంది. శౌర్య విందేమో అని పారిజాతం టెన్షన్ పడుతూ.. శౌర్యని ఎవరికి చెప్పాకూ అంటూ బుజ్జగిస్తుంటే.. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఏంటని అడుగగా.. మా అమ్మమ్మ , తాత మాట్లాడుకుంటుంటే చాటుగా వింటుంది.‌ తప్పు కదా అని శౌర్య అనగానే.. ఛీ నీకు బుద్ది రాదంటూ శివన్నయారాయణ పారిజాతాన్ని తిడతాడు.

ఆ తర్వాత కార్తీక్ కి స్వప్న ఫోన్ చేసి.. విషయం చెప్తుంది. నాకు ఇప్పుడు చావు తప్ప.. వేరే లేదనగానే.. నేను మీ పెళ్లి చేస్తానని కార్తీక్ మాటిస్తాడు. ఆ తర్వాత శౌర్య వచ్చి కార్తీక్ ఫోన్ నుండి దీపకి చేస్తుంది. దీప లిఫ్ట్ చెయ్యదు. శౌర్య వెళ్తుంది. జ్యోత్స్న వస్తుంటే కార్తీక్ కి తల నొప్పి డిస్టబ్ చెయ్యకనగానే శౌర్యపై జ్యోత్స్న కోప్పడుతుంది. కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి నాతో మాట్లాడడం లేదని అడుగుతుంది. నన్ను కాసేపు వదిలేయమని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప ఫోన్ చేస్తుంది. కార్తీక్ చెప్పండి అని దీప అనగానే.. నాతో మాట్లాడ్డం వీలు కాదు.. దీపతో మాట్లాడుతావా అని జ్యోత్స్న అనుకుంటుంది. నేను ఫోన్ చెయ్యలేదు శౌర్య చేసిందని కార్తీక్ అంటాడు‌. ఒక విషయం చెప్పాలి త్వరగా రండి అని కార్తీక్ అనగానే.. నేనొక విషయం చెప్పాలి ఇంటికి వచ్చాక చెప్తానని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.