English | Telugu

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరంటే?..

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. అనూజ అనే అమ్మాయితో ఇటీవల అవినాష్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న అవినాష్.. తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేశాడు.

జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో అరియానాతో అవినాష్ క్లోజ్ గా మూవ్ అవడంతో వీరి మధ్య ఎదో నడుస్తుందనే రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, వీరు పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే, ఇద్ద‌రూ వాటిని ఖండించారు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ రూమర్స్ ఆగలేదు. అయితే ఇప్పుడు తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలతో ఈ రూమర్స్ కి చెక్ పెట్టాడు అవినాష్.

ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లుగా అవినాష్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. "మ‌న జీవితంలోకి రైట్ ప‌ర్స‌న్ వ‌చ్చిన‌ప్పుడు ఆలస్యం వద్దు. మా కుటుంబాలు క‌లిసాయి. తర్వాత మేము క‌లిసాం. వెంట‌నే ఎంగేజ్‌మెంట్ అయింది. మీరందరూ ఎప్ప‌టి నుండో పెళ్లి ఎప్పుడు? అని అడుగుతున్నారు. నా అనూజ‌ను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఎప్ప‌టిలానే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను" అని అవినాష్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.