English | Telugu
మూడో కాన్పుకు అనసూయ రెడీ?!
Updated : Sep 4, 2021
అనసూయ మరోసారి ప్రెగ్నెంట్ కానుందా? మూడో బిడ్డకు జన్మనివ్వనుందా? నెక్ట్స్ వీక్ టెలికాస్ట్ కాబోయే ‘జబర్దస్త్’ ప్రోమో చూస్తే... ఇటువంటి సందేహాలు కలగడం సహజమే! ‘అదిరే’ అభి మాటకు మాటగా... స్పాంటేనియస్గా, సరదాగా అనసూయ చెప్పిందేమో! అయితే, ఆమె మాటలే హైలైట్ అయ్యాయి.
‘టైమ్కు అన్నం తిను. పులుపు తినాలని అనిపిస్తే... నేను మామిడిపళ్లు అవీ పంపిస్తా’ – అనసూయతో అభి అన్న మాటలివీ. వెంటనే ఏమాత్రం తడుముకోకుండా ‘టైముంది దానికి’ అని అనసూయ చెప్పింది. ప్రెగ్నెంట్ లేడీస్కి పులుపు తినాలని అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో అభి అన్నట్టు అక్కడ సీన్ కనిపించింది. దానికి తోడు అభి స్కిట్లో ఫీమేల్ ఆర్టిస్ట్ ‘ఏంటి అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు?’ అంటే... ‘తొమ్మిదో నెల కదే’ అన్నాడు. ‘అనసూయకు మళ్లీ తొమ్మిదో నెలా?’ అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అప్పుడు అసలు విషయం బయటపెట్టారు. ‘నాకు కాదు... అందరికీ తొమ్మిదో నెలే ఇది’ అని అనసూయ అన్నది.
అయితే... ముందు ‘పులుపు తినడానికి టైముంది’ అని అనసూయ అనడంతో మళ్లీ గర్భం దాల్చడానికి, మరో బిడ్డకు జన్మనివ్వడానికి ఆమె సిద్ధంగా ఉందని పలువురు భావిస్తున్నారు. ఆల్రెడీ భరద్వాజ్, అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.
నెక్ట్స్ వీక్ ‘జబర్దస్త్’లో స్పెషాలిటీ ఏంటంటే... కొన్ని రోజులుగా షోకి దూరమైన ‘రైజింగ్’ రాజు, మళ్లీ ‘హైపర్’ ఆదితో కలిసి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లతో పాటు ప్రోమోలో ‘జయం’ స్పూఫ్తో ‘చలాకీ’ చంటి టీమ్ సందడి చేసింది.