English | Telugu
Illu illalu pillalu : నిజం తెలుసుకున్న ప్రేమ, నర్మద.. ధీరజ్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తాడా!
Updated : Oct 29, 2025
స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -301 లో..... ధీరజ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ధీరజ్ వెనకాలే రామరాజు, తిరుపతి ఇంకా తన ఇద్దరు కొడుకులు వెళ్తారు. స్టేషన్ లో శోభ వాళ్ళ నాన్న ఉంటాడు. ప్లీజ్ అండి మా అబ్బాయి అలాంటి వాడు కాదు.. కంప్లైంట్ వెనక్కి తీసుకోమని రామరాజు రిక్వెస్ట్ చేస్తాడు. నా కూతురిని కిడ్నాప్ చేసాడు. ఎలా కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని అతను అంటాడు.
ప్రేమ, నర్మద కూడా స్టేషన్ కి వెళ్తారు. మరొకవైపు అత్తింటి విషయం శ్రీవల్లి తీసుకొని వెళ్లి పుట్టింట్లో చేరవేస్తుంది. ఇప్పుడు ధీరజ్ పై ఇంకా కోపం వచ్చేలా చేస్తే ప్రేమ, ధీరజ్ ని ఇంట్లో నుండి గెంటెస్తారని శ్రీవల్లి ప్లాన్ చేస్తుంది. కానీ అలా వద్దు.. ఇప్పుడు మనం మీ మావయ్య దగ్గర సింపథీ కొట్టెయ్యాలని రామరాజుకి భాగ్యం ఫోన్ చేస్తుంది. మీరు ఏం కంగారు పడకండి అన్నయ్య.. నాకు తెల్సిన లాయర్ ని పంపిస్తాను.. బెయిల్ ఇప్పిస్తాడని భాగ్యం చెప్తుంది. వద్దని రామరాజు అంటున్నా భాగ్యం చిరాకు తెప్పిస్తుంది. దాంతో నర్మద ఫోన్ తీసుకొని లాయర్ ని పంపించండి పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలని చెప్పగానే భాగ్యం భయపడి ఫోన్ వినపడనట్లు యాక్ట్ చేసి కట్ చేస్తుంది.
మరోవైపు ధీరజ్ ని చూస్తూ ప్రేమ ఎమోషనల్ అవుతుంది. అదేసమయంలో సాగర్, చందు బెయిల్ కోసం లాయర్ దగ్గరికి వెళ్తారు కానీ అలాంటి కేసుకి బెయిల్ రాదని లాయర్ చెప్తాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో తెలిస్తే శోభని మనం వెతకొచ్చు అని ప్రేమతో నర్మద అంటుంది. అక్కడ కానిస్టేబుల్ ని రిక్వెస్ట్ చేసి ధీరజ్ దగ్గరికి వెళ్లి అసలేం జరిగిందో కనుక్కోమంటారు. కాసేపటికి ధీరజ్ దగ్గరికి కానిస్టేబుల్ వెళ్తాడు. అసలు విషయం కనుక్కొని వచ్చి ప్రేమ, నర్మదకి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.